Central Vista: సెంట్రల్ విస్తా దేశానికే తలమానికం.. ఇందులో ప్రత్యేకతలు చూస్తే అబ్బా అనాల్సిందే..

దేశంలో ప్రతి పౌరుడు గర్వించదగ్గ నిర్మాణమే సెంట్రల్ విస్తా. కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి అందంగా, రమణీయంగా నిర్మించారు. సెప్టెంబర్ 19న తొలి అడుగు పెట్టి సమావేశాన్నిజరుపుకోబోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 19, 2023 | 11:17 AMLast Updated on: Sep 19, 2023 | 11:17 AM

Central Vista Features The Newly Constructed Parliament Building

ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన స్థానం, గౌరవం పార్లమెంటుకు ఉంటుంది. దేశంలోని కోట్ల మంది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిథులు ఇక్కడ కూర్చుంటారు. తమకు ఓటు వేసి గెలిపించిన వారికి ఏమి అవసరమో గుర్తించి వాటిని అందించేందుకు దోహదపడతారని ఈ విధానాన్ని తీసుకువచ్చారు. అయితే గతంలో ఉన్న పార్లమెంట్ భవనానికి శతబ్ధి కాలం దగ్గర పడుతుండటంతో నూతన భవనాన్ని నిర్మించారు. ఈ భవనం ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం.

నిర్మాణం మొదలు యూనిఫారం వరకూ అన్నీ ప్రత్యేకమే..

  • అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించారు.
  • త్రిభుజాకారంలో నిర్మించిన భవనాన్ని 150 ఏళ్లపాటూ చెక్కు చదరకుండా ఉండేలా తీర్చిదిద్దారు.
  • లోక్ సభ భవనం జాతీయ పక్షి నెమలి ఆకారంలో కనపడేలా ఆర్కిటెక్.
  • రాజ్యసభ భవనం జాతీయ పుష్పం తామర పువ్వు ఆకారంలో ఉంటుంది.
  • అధునాతనమైన టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ, సుపీరియర్ క్వాలిటీ ఆడియో విజువల్ పరికరాలను అమర్చారు.
  • అత్యంత భద్రతతో పాటూ పర్యావరణ హితంగా దీనిని నిర్మాణం చేపట్టారు.
  • నూతన పార్లమెంట్ భవనాన్ని జ్ఞాన, శక్తి, కర్మ అనే మూడు ప్రధాన ద్వారాలతో, నాలుగు అంతస్తులలో నిర్మించారు.
  • ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ నుంచి తెచ్చిన తివాచీలు, త్రిపుర వెదురుతో సిద్దం చేసిన గచ్చు, రాజస్థాన్ లో రూపు దిద్దుకున్న శిలాకృతులను ఇందులో ఉపయోగించారు.
  • భారతీయ సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా రూపకల్పన చేశారు. 
  • సెంట్రల్ విస్తా భవనంలో ఉపయోగించిన టేకును మహారాష్ట్ర నాగ్ పూర్ నుంచి, ఫర్నీచర్ ను ముంబై నుంచి, నాలుగు సింహాలతో కూడిన అశోక చక్రం సామాగ్రిని ఔరంగబాద్ నుంచి తెప్పించారు.
  • ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్ స్పూర్తి పరిణవిల్లేలా యావద్దేశానకి ఏదో ఒక రూపంలో చోటు కల్పించారు.
  • లోక్ సభ స్పీకర్ కుర్చీ పక్కన ఏర్పాటు చేసిన సెంగోల్ అనే బంగారు రాజదండం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
  • పార్లమెంట్ గ్యాలరీలో జాతీయత ఉట్టిపడేలా వివిధ కళాకృతులు ఏర్పాటు చేయగా అందులో ఫైకాల్డ్ పెండ్యూలమ్ అనే వస్తువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
  • ఇది భూభ్రమణాన్ని సూచిస్తుంది.
  • 1272 మంది ఒకేసారి కూర్చునేలా సమావేశ మందిరం ఉంటుంది.
  • అవసరాన్ని బట్టి వినియోగించుకునేలా రకరకాల సమావేశ మందిరాలతోపాటూ కమిటీ హాల్స్ ను ఏర్పాటు చేశారు.
  • పార్లమెంట్ ఉభయసభలతో పాటూ ప్రధాని కార్యాలయం, నివాసం, ఉపరాష్ట్రపతి నివాసం, కేంద్ర సచివాలయం ఉంటాయి.
  • 64వేల 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు.
  • ఈ భవన నిర్మాణానికి రూ. 970కోట్ల రూపాయలు వెచ్చించారు.
  • పార్లమెంట్ భవన సిబ్బందికి కొత్త యూనిఫారం మరో పత్యేకత.
  • సఫారీ కాస్త మిలటరీ యూనిఫారం రూపంలో మారిపోయింది.
  • నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వీటిని రూపొందించింది.
  • ఎంపీలకు, మీడియా వాళ్ళకు తక్కువ ధరలకే ఫుడ్ అందించేలా ప్రత్యేక క్యాంటీన్ ఏర్పాటు చేశారు.

ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసి సర్వాంగ సుందరంగా నిర్మించుకున్న ఈ నూతన భవనం నుంచి అయినా సభ సజావుగా సాగేలా, ప్రజలకు ఉపయోగకరమైన చట్టాలు చేసేలా కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటారని భావిద్దాం. ప్రపంచం గర్వించ దగ్గ దేశంగా తీర్చి దిద్ది సరికొత్త మార్పు తీసుకొస్తారని ఆశిద్దాం.

T.V.SRIKAR