టీచర్లకు చంద్రబాబు గుడ్ న్యూస్, బాత్రూం ఫోటోలు పెట్టొద్దు…!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 6, 2024 | 09:05 AMLast Updated on: Aug 06, 2024 | 9:05 AM

Chandrababu Good News For Teachers

ఆంధ్రప్రదేశ్ లో గత అయిదేళ్లుగా ప్రభుత్వం పెట్టిన రూల్స్ దెబ్బకు ఉద్యోగులు భయపడిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులను అయితే వేధించారు అనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ కూడా పోరాటం చేసిన పరిస్థితి. మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళు వైసీపీని వ్యతిరేకించడానికి కారణం అదే అనే కామెంట్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రస్తుత ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

బాత్ రూం ఫొటోల క్యాప్చరింగ్ యాప్ తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. పాఠశాలలకు వెళ్ళి ఉదయాన్నే బాత్ రూంలు ఫోటోలు తీసి.. యాప్ లో అప్లోడ్ చేయాలని గత వైసీపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీనిపై గతంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉపాధ్యాయ సంఘాలు, ఈ విధానం తొలగించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడంతో కూటమి ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.