మెగాటోర్నీకి ముందు వివాదం, ఆప్ఘన్ తో మ్యాచ్ ఆడొద్దు

వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ మెగా టోర్నీకి ముందు వివాదం చెలరేగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 8, 2025 | 05:47 PMLast Updated on: Jan 08, 2025 | 5:47 PM

Controversy Before The Mega Tournament No Match Against Afghanistan

వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ మెగా టోర్నీకి ముందు వివాదం చెలరేగింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే మ్యాచ్‌ను బహిష్కరించాలని ఇంగ్లండ్‌కు చెందిన ప్రజాప్రతినిధులు ఆ దేశ క్రికెట్‌ బోర్డును కోరారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వం మ‌హిళ‌ల హ‌క్కుల‌పై ఆంక్ష‌లు విధిస్తున్న నేపథ్యంలో ఇంగ్లండ్‌ పొలిటీషియన్స్‌ ఈ మేరకు పిలుపునిచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ ఫిబ్రవరి 26న ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని 160 మందికి పైగా రాజకీయ నాయకులు ఈసీబీ​కి విజ్ఞప్తి చేశారు. అయితే ఇంగ్లండ్‌ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిని ఈసీబీ తిరస్కరించినట్లు సమాచారం​. క్రీడలకు రాజకీయ కారణాలు ముడిపెట్టొద్దని కోరినట్టు తెలుస్తోంది.