Dhoni : ధోనీ శిష్యుడనే ప్లేస్ లేదా ? రుతురాజ్ కు చోటివ్వకపోవడంపై ఫ్యాన్స్

టీమిండియా కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ మొదటి సిరీస్ శ్రీలంక టూర్ నుంచే ప్రారంభం కాబోతోంది. అయితే ఈ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టుపై విమర్శలు వస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 20, 2024 | 01:16 PMLast Updated on: Jul 20, 2024 | 1:16 PM

Dhonis Disciple Is Not A Place Fans Not Giving Place To Ruthuraj

టీమిండియా కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ మొదటి సిరీస్ శ్రీలంక టూర్ నుంచే ప్రారంభం కాబోతోంది. అయితే ఈ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టుపై విమర్శలు వస్తున్నాయి. కొందరు ఆటగాళ్ళ ఎంపికపైనా, మరికొందరిని పక్కన పెట్టడంపైనా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. గంభీర్ ను టార్గెట్ చేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కేవలం ధోనీ శిష్యుడనే కారణంతోనే రుతురాజ్ గైక్వాడ్ ను ఎంపిక చేయలేదని ఆరోపిస్తున్నారు. కోల్ కత్తా జట్టులో ఉన్న కొందరికి చోటు కల్పిస్తూ.. ధోని మనిషి కావడంతోనే రుతురాజ్ పై వేటు వేశారని ఫైరవుతున్నారు.జింబాబ్వే సిరీస్‌లో నిలకడగా పరుగులు సాధించినా.. అతనికి జట్టులో చోటు ఎందుకు ఇవ్వలేదని సెలెక్టర్లను ప్రశ్నిస్తున్నారు.

రుతురాజ్ గైక్వాడ్ జింబాబ్వే టూర్ లో నిలకడగా రాణించాడని , ఏ ప్లేస్ లో దింపినా బాగా ఆడాడని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో కోల్ కత్తా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వన్డే జట్టులో చోటు దక్కించుకోవడంపై కూడా అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అలాగే కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణా చోటు దక్కించుకోవడంపై కూడా నెట్టింట్లో పోస్టులు వెల్లువెత్తున్నాయి. కోచ్‌గా బాధ్యతలు చేపట్టకముందు గంభీర్ కేకేఆర్‌కు మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. దీంతో ఆ ప్రేమతోనే ఆ ఇద్దరికి జట్టులో చోటు దక్కిందని విమర్శిస్తున్నారు.