దివ్వెల మాధురి అడ్డంగా ఇరుక్కుపోయారా…?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 11, 2024 | 04:47 PMLast Updated on: Aug 11, 2024 | 4:47 PM

Divvela Madhuri Attempted Suicide

గత వారం రోజుల నుంచి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తోంది. ఈ వ్యవహారంలో నేడు కీలక మలుపు తీసుకుంది. తాజాగా ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న దివ్వెల మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పలాస మండలం లక్ష్మీoపురం టోల్గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన దివ్వెల మాధురి… ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

టెక్కలి నుంచి పలాస వైపు వెళ్తుండగా రోడ్డుపై ఆగి ఉన్న కారును వెనుక నుంచి ఢీ కొట్టింది ఆమె కారు. రోడ్డుపైనే మాధురి కారు… పల్టీ కొట్టింది. మాధురి సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. తలకు తీవ్ర గాయాలు కావడంతో పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో ఆమె కీలక వ్యాఖ్యలు చేసారు. హాస్పిటల్ లో చికిత్సకు ఆమె నిరాకరిస్తున్నారు. నాకు చనిపోవాలని ఉంది. నాపైన నా పిల్లల పైన వస్తున్న ట్రోల్స్ తట్టుకోలేకపోతున్నాను అంటూ ఆమె కామెంట్ చేసారు. నేను చనిపోవాలని వెళ్తున్నాను అన్నారు. చనిపోదామనుకొని నేనే కారును గుద్దేశాను అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఆమె అడ్డంగా ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఆత్మహత్యా ప్రయత్నం చేయడం అనేది నేరం. కాబట్టి ఆమెపై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.