దువ్వాడకు షాక్, అమెరికా చెక్కేస్తున్న మాధురి

ఒకవైపు భార్య, కుమార్తెల నిరసనతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు మరో షాక్ తగిలే అవకాశం కనపడుతోంది. దువ్వాడ కుటుంబంలో చిచ్చుకి కారణమైన దివ్వెల మాధురి ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 19, 2024 | 11:11 AMLast Updated on: Aug 19, 2024 | 11:11 AM

Divvela Madhuri Going To America

ఒకవైపు భార్య, కుమార్తెల నిరసనతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు మరో షాక్ తగిలే అవకాశం కనపడుతోంది. దువ్వాడ కుటుంబంలో చిచ్చుకి కారణమైన దివ్వెల మాధురి ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియాకు పది రోజులు దూరంగా ఉంటా అంటూ ఒక వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వైద్యులు రెస్ట్ తీసుకోమన్నారని అందుకే తాను పది రోజుల తర్వాత మీతో మాట్లాడతా అంటూ ఆమె కోసం ఎదురు చూసే వాళ్లకు ఒక వీడియో సందేశం ఇచ్చారు.

ఆ పది రోజుల గ్యాప్ లో ఆమె అమెరికా వెళ్ళిపోయే ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక టికెట్ బుక్ అయింది. అయితే ఆమెతో పాటుగా దువ్వాడ శ్రీనివాస్ కూడా వెళ్ళే అవకాశం ఉందని కొందరు అంటున్నా అది నిజం కాదని తెలుస్తోంది. ఆమె అమెరికా వెళ్ళడం వెనుక రెండు కారణాలు ఉండవచ్చు అంటున్నారు టెక్కలి జనాలు. ఇక్కడ ఉంటే ఆమెపై మీడియా ఫోకస్ ఎక్కువ అవుతుంది. శ్రీనివాస్ కంటే అందరూ ఆమెనే ఎక్కువగా తిడుతున్నారు. ఇవి భరించలేక మానసిక ప్రశాంతత కోసం ఆమె వెళ్ళిపోయే ప్లాన్ చేసుకుని ఉండవచ్చు.

లేదంటే… ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆమె దూరంగా ఉంటే మంచిదనే ప్లాన్ లో భాగంగానే ఆమెను అమెరికా పంపిస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఒక రెండు నెలలు ఆమె అమెరికాలో ఉంటే… దువ్వాడ వాణితో శ్రీనివాస్ వివాదాన్ని పరిష్కరించుకుని, అప్పుడు మాధురి ఇక్కడికి వస్తే సమస్య ఉండకపోవచ్చు అని లెక్కలు వేసుకుంటున్నారు అని తెలుస్తోంది. ఆమె భర్త ఇప్పటికే అమెరికాలో ఉన్నారు. మాధురికి టూరిస్ట్ వీసా కూడా ఉందని సమాచారం. ఆ వీసా గడువు ఇంకా ఏడేళ్ళు ఉందట. అందుకే ఆమె ఇప్పుడు వెళ్లి ఒక రెండు నెలలు అక్కడ ఉండి వస్తే మంచిదనే ప్లాన్ లో ఉన్నారట. ఈ లోపు శ్రీను గారిని వాణి తనవైపుకు తిప్పుకుంటే మాధురి పరిస్థితి ఏంటో మరి… ఆ… ఆ మాత్రం తెలివి లేకుండా వెళ్తుందా అంటున్నారు టెక్కలి జనాలు.