Exciting exit polls : కాక రేపుతున్న ఎగ్జిట్‌ పోల్స్‌.. రాజకీయ నాయకుల్లో నరాలు తెగే టెన్షన్‌..

తెలంగాణలో పోలింగ్‌ ముగిసింది. కౌంటింగ్‌కి ఇంకా టైం ఉంది. ఈ మధ్యలో వినిపిస్తున్న రకరకాల లెక్కల వల్ల టెన్షన్‌తో రాజకీయ నాయకుల నరాలు తెగుతున్నాయట. అధికారం రేసులో లేకున్నా.. కమళం పార్టీ కారును హస్తాన్ని టెన్షన్‌ పెడుతోంది. ఆ పార్టీకి ఓటింగ్‌ శాతం పెరిగిందన్న అంచనాలు.. మిగతా వాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయట. ఆ విషయంలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి? బీజేపీ చీల్చే ఓట్లు ఎవరివి? వాటి ప్రభావం ఎంత? ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌. ఈ సారి తెలంగాణలో దాదాపు 70 శాతం పోలింగ్‌ జరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 2, 2023 | 12:50 PMLast Updated on: Dec 02, 2023 | 12:50 PM

Exciting Exit Polls Nerve Breaking Tension Among Politicians

తెలంగాణలో పోలింగ్‌ ముగిసింది. కౌంటింగ్‌కి ఇంకా టైం ఉంది. ఈ మధ్యలో వినిపిస్తున్న రకరకాల లెక్కల వల్ల టెన్షన్‌తో రాజకీయ నాయకుల నరాలు తెగుతున్నాయట. అధికారం రేసులో లేకున్నా.. కమళం పార్టీ కారును హస్తాన్ని టెన్షన్‌ పెడుతోంది. ఆ పార్టీకి ఓటింగ్‌ శాతం పెరిగిందన్న అంచనాలు.. మిగతా వాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయట. ఆ విషయంలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి? బీజేపీ చీల్చే ఓట్లు ఎవరివి? వాటి ప్రభావం ఎంత? ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌. ఈ సారి తెలంగాణలో దాదాపు 70 శాతం పోలింగ్‌ జరిగింది. ఎగ్జిట్ పోల్ ఫలితాల సంగతి ఎలా ఉన్నా.. తమవైన ఈక్వేషన్స్‌తో గెలుపు ఓటముల లెక్కలు వేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. క్షేత్ర స్థాయిలో పోలింగ్‌ సరళిపై ఆరా తీస్తున్నాయి. ఈ క్రమంలోనే కమలం పార్టీ నేతలు కూడా వివిధ మార్గాల్లో సమాచార సేకరణ చేస్తున్నారట.

మరికొన్ని గంటల్లో ఎలక్షన్‌ రిజల్ట్‌.. తెలంగాణ తీర్పు ఎలా ఉండబోతోంది..

గత లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఎక్కడైతే ప్రభావం చూపిందో.. ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా మంచి ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ వాళ్లకు అందిన రిపోర్ట్ ప్రకారం.. వాళ్ల ఓటింగ్‌ శాతం పెరిగిందని చెప్తున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో పార్టీ బలంగా ఉండడం.. ఎస్సీ వర్గీకరణ, బీసీ సీఎం నినాదం లాంటివి కలిసొస్తాయన్నది బీజేపీ లెక్కగా తెలిసింది. ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి ఓట్ల శాతం చాలా తక్కువగా చూపారని.. వాస్తవానికి తమ ఓట్ బ్యాంక్‌ అనూహ్యంగా పెరిగిందని బీజేపీ నేతలు చెప్తున్నారు. నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో తమకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. కామారెడ్డిని కూడా తమ ఖాతాలోనే వేసుకుంటున్నారు బీజేపీ నేతలు. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు, న్యూట్రల్ ఓట్లు తమకే పడ్డాయని అభిప్రాయపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు ఇతర పార్టీలకి షిఫ్ట్ అయిందని, ఈసారి తమ ఓట్లు పూర్తిగా కమలానికే పడ్డాయని అంటున్నారు టీ బీజేపీ నేతలు.

గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి చాలా నియోజక వర్గాల్లో బలమైన నేతలు బరిలో ఉన్నారని, పార్టీకి వారి సొంత బలం కూడా జత అయిందని, రాష్ట్రమంతటా తమ ఓటు శాతం పెరుగుతుందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 7 శాతం. ఇప్పుడు ఆ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగితే ఏ పార్టీ కొంప మునుగుతుందోనన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. రకరకాల సమీకరణాల్ని తెర మీదికి తెస్తూ లెక్కలేసుకుంటున్నాయి మిగతా రాజకీయ పార్టీలు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీజేపీ చీలిస్తే.. అంతిమంగా అది తమకే లాభిస్తుందని లెక్కగడుతోందట బీఆర్‌ఎస్‌. అర్బన్‌ ఏరియాల్లో బీజేపీ ఓటింగ్‌ పెరిగిందన్న అంచనాలు ఎక్కువగా ఉన్నందున.. అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలతాయని, తమకు అడ్వాంటేజ్‌ అవుతుందన్నది కారు పార్టీ లెక్కగా చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో దాదాపు 100 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్స్‌ దక్కలేదు. అలాంటిది ఈసారి బలం పెరిగిందన్న అంచనాల నడుమ ఆ పార్టీ చీల్చే ఓట్ల మీద మిగతా పక్షాల్లో ఉత్కంఠ పెరుగుతోంది.