తాగింది, సె** చేసి కోసేసింది

ఈ మధ్య కాలంలో ఆడాళ్ళు కాస్త క్రూరంగా మారుతున్నారు. గతంలో మగాళ్ళు దారుణాలకు పాల్పడే వారు అనే పేరు ఉండేది. ఇప్పుడు ఆ స్థానంలోకి మహిళలు వస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 25, 2024 | 11:53 AMLast Updated on: Aug 25, 2024 | 11:53 AM

Girl Atack On Her Boy Friend

ఈ మధ్య కాలంలో ఆడాళ్ళు కాస్త క్రూరంగా మారుతున్నారు. గతంలో మగాళ్ళు దారుణాలకు పాల్పడే వారు అనే పేరు ఉండేది. ఇప్పుడు ఆ స్థానంలోకి మహిళలు వస్తున్నారు. నేరాల్లో లేకపోయినా తాము ప్రేమించిన వారిని, సహజీవనం చేసిన వారిని అత్యంత దారుణంగా కడతెర్చడమో లేదా చిత్ర హింసలకు గురి చేయడమో చూస్తూనే ఉన్నాం. ఇటీవల తనను మోసం చేసాడని ఒక యువతీ పెళ్లిలో దాడికి దిగింది. అలాగే ఒక మహిళ తన ప్రియుడి మర్మాంగం కోసేసిన ఘటన మనం చూసాం. ఇలా ఎక్కడో చోట మహిళలు మేము కూడా తక్కువేం కాదని ప్రూవ్ చేస్తున్నారు.

తాజాగా ఒక ఘటన ప్రకాశం జిల్లాలో సంచలనం అయింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడులో తనతో సహజీవనం చేస్తున్న యువకుడి మర్మాంగంపై దాడి చేసింది ఒక యువతి. తీవ్రమైన గాయాలు కావడంతో గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా సహజీవనంలో ఉన్న బీహార్‌కు చెందిన జంట స్థానికంగా ఉండే డైరీ ఫాంలో పని చేస్తున్నట్టు గుర్తించారు. ఇద్దరూ అక్కడే ఉంటారని, వారికి యజమాని ఆశ్రయం కల్పించినట్టు తెలిసింది. నిన్న సాయంత్రం పని పూర్తైన తర్వాత ఇద్దరూ శనివారం కావడంతో పార్టీ చేసుకున్నారు.

రాత్రి మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో కత్తితో యువకుడి మర్మాంగంపై దాడి యువతి దాడికి దిగింది. ఇద్దరూ శృంగారంలో పాల్గొన్నారని ఆ సమయంలో ఇద్దరి మధ్యలో గొడవ తలెత్తి అనంతరం మర్మాంగంపై దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఆ యువకుడి ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి మధ్య ఘర్షణ ఎందుకు చోటు చేసుకుంది, వీళ్ళు ఎప్పటి నుంచి కలిసి ఉంటున్నారు, ఘటనకు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. యువతీపై హత్య కేసు నమోదు చేసినట్టు సమాచారం.