బ్రేకింగ్: అడ్డంగా బుక్కైన హర్షా సాయి

పెళ్లి పేరుతో తనను మోసం చేసాడు అంటూ ఓ యువతీ ప్రముఖ యూట్యూబర్ హర్షా సాయిపై ఫిర్యాదు చేసింది. యూట్యూబర్ హర్షసాయి పై నార్సింగి పీఎస్ లో మిత్రా శర్మ అనే యువతి ఫిర్యాదు చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 24, 2024 | 07:26 PMLast Updated on: Sep 24, 2024 | 7:41 PM

Girl Complaint On Harsha Sai

పెళ్లి పేరుతో తనను మోసం చేసాడు అంటూ ఓ యువతీ ప్రముఖ యూట్యూబర్ హర్షా సాయిపై ఫిర్యాదు చేసింది. యూట్యూబర్ హర్షసాయి పై నార్సింగి పీఎస్ లో మిత్రా శర్మ అనే యువతి ఫిర్యాదు చేసింది. అడ్వకేట్ తో కలిసి నార్సింగి పీఎస్ కి వచ్చి ఆమె సాక్ష్యాలతో ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది.

పేదవారికి సాయం చేస్తూ యూట్యూబ్ లో ఫేమస్ అయిన హర్షా సాయి మాయ మాటలు చెప్పాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాగా గత కొన్నాళ్ళుగా హర్షా సాయి వరుస వివాదాల్లో ఉంటున్నాడు. అతను సాయం చేస్తున్న వీడియోలు కచ్చితంగా ఫేక్ అంటూ సోషల్ మీడియాలో పలువురు ఆరోపణలు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ లతో మోసం చేస్తున్నాడని ఆరోపించారు. దీనిపై హర్షా సాయి వివరణ కూడా ఇచ్చాడు.