HARISH RAO: రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: హరీష్ రావు

నాడు అధికారంలో ఉండీ కాంగ్రెస్‌ రైతులను గోస పెట్టింది. నేడు ప్రతిపక్షంలో ఉండి కూడా గోస పెడుతున్నది. వ్యవసాయం దండగ అన్నొడికి వారసుడు రేవంత్. మూడు గంటల కరెంట్ చాలు అన్నడు. అక్టోబర్ 23న మానిక్ రావు ఠాక్రే.. రైతు బంధు వేయొధ్దు అని ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 27, 2023 | 08:25 PMLast Updated on: Nov 27, 2023 | 8:26 PM

Harish Rao Sensational Comments On Congress Over Rythu Bandhu

HARISH RAO: రైతు బంధు అడ్డుకుని, రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు నవంబర్ 30న ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్, తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. “కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి రైతాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. అధికారంలో ఉన్నపుడు కూడా కాంగ్రెస్‌ది అదే పరిస్థితి. అర్థరాత్రి పూట కరెంట్ ఇచ్చి అరిగోస పెట్టింది. ఎరువులు ఇవ్వకుండా రైతులను బాధ పెట్టింది. 2009లో ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేసింది. ప్రాజెక్టులు కట్టలేదు. నీళ్ళు ఇవ్వలేదు. అసెంబ్లీ వద్ద మేము ధర్నా చేస్తే పట్టించుకోలేదు. నాడు అధికారంలో ఉండీ రైతులను గోస పెట్టింది.

REVANTH REDDY: హరీష్ రావు వల్లే రైతు బంధు ఆగింది.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎకరాకు రూ.15వేలు ఇస్తాం

నేడు ప్రతిపక్షంలో ఉండి కూడా గోస పెడుతున్నది. వ్యవసాయం దండగ అన్నొడికి వారసుడు రేవంత్. మూడు గంటల కరెంట్ చాలు అన్నడు. అక్టోబర్ 23న మానిక్ రావు ఠాక్రే.. రైతు బంధు వేయొధ్దు అని ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మీటింగ్ పెట్టీ చెప్పారు. భట్టి విక్రమార్క.. రైతు బంధు దుబారా ఆంటే, రేవంత్ రైతులు బిచ్చగాళ్లు అంటారు. కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం ఇక్కడే ఉన్నారు. వాళ్లు కర్ణాటకలో అధికారంలోకి వచ్చాక అక్కడ రైతు పెట్టుబడి సాయం రద్దు చేశారు. ఇక్కడ వాళ్ళే రైతు బంధుపై పిర్యాదు చేశారు. అనుమతి ఇస్తే ఎలా ఇస్తారు అన్నారు. మళ్లీ రద్దు చేయాలని మీరే పిర్యాదు చేశారు. ఇప్పుడు బిజెపి, బిఆర్ఎస్ ఫెవికాల్ బంధం అని తప్పు మాట్లాడుతారు. రైతుల నోటి కాడి బుక్కను లాగేసింది కాంగ్రెస్ పార్టీ. దొంగే.. దొంగ అన్నట్టు ఉంది కాంగ్రెస్ పరిస్థితి. వంద పిల్లులు తిన్న పిల్లి నేను శాఖాహారి అన్నట్టు ఉంది. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు నవంబర్ 30న ఎన్నికల్లో బుద్ది చెప్పాలి. దేశంలో రైతు బంధు సృష్టికర్త కేసీఆర్. కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ చేతిని అడ్డం పెట్టి రైతు బంధు ఆపలేరు. ఎన్నికలో గెలిస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అని కాంగ్రెస్ నాయకులు బాండ్ పేపర్లు రాస్తున్నారు.

రాహుల్ గాంధీ వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎవరికి ఇచ్చారు సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీకి దమ్ముంటే ఉద్యోగాల విషయమై చికడపల్లిలో కాదు.. బెంగళూరులో మీటింగ్ పెట్టు. మీ బాండ్ పేపర్లు చిత్తు కాగితాలతో సమానం. ఉద్యమాల గడ్డపై ప్రజలు మీ మాయ మాటలు నమ్మరు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు. 80 సీట్లతో మంచి గెలుపు సాధిస్తాం. బిజెపి, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయి. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఎందుకు అమలు చేయరు. బిజెపి, కాంగ్రెస్ దొందు దొందే. మీటర్లు పెట్టాలని బిజెపి అంటే, మూడు గంటల కరెంట్ చాలు అని కాంగ్రెస్ అంటది. తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ ఇప్పుడు రైతు బంధు అపొచ్చు కానీ.. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వస్తాయి. 6 నుంచి మనం రైతు బంధు అమలు చేసుకుందాం” అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.