Indian Railways: ఈ కొత్త రూల్స్ ఫాలో అయితే సులభంగా.. ఆనందంగా రైలు ప్రయాణం చేయవచ్చు..

రైలు అంటేనే టికెట్ బుకింగ్ మొదలు రైలు ఎక్కే వరకు హడావిడి ప్రయాణం. టికెట్ దొరుకుతుందో లేదో.. వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే కన్ఫామ్ ఎప్పుడు అవుతుందో.. రైలు సరైన సమయానికి వస్తుందా.. ఏ ప్లాట్ ఫాం మీద వస్తుంది. ఇలా సామాన్యునికి అన్నీ ప్రశ్నలే తలెత్తుతాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 26, 2023 | 07:51 PMLast Updated on: Jun 26, 2023 | 7:51 PM

Indian Railways Has Brought New Rules From July In Which The Wakeup Call Feature Has Been Introduced

అలాంటి రైల్వే సరికొత్తగా ప్యాసింజర్ల ప్రయాణం సుఖమయం, సౌకర్యవంతం కావాలని కోరుకుంటూ కొన్ని రూల్స్ ని మార్చనుంది. ఈ మార్పు చేసిన సరికొత్త నియమాలు జూలై 1 నుంచి అమలు కానున్నట్లు తెలిపింది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

రైల్వే శాఖ కొత్త రూల్స్ ఇవే..

  •  వెయిటింగ్ లిస్ట్ యొక్క అవాంతరం ముగుస్తుంది. రైల్వేలు నడుపుతున్న సువిధ రైళ్లలో ప్రయాణికు లకు కన్ఫర్మ్ టిక్కెట్ల సౌకర్యం కల్పించ బడుతుంది.
  • జూలై 1 నుండి, తత్కాల్ టిక్కెట్ల రద్దుపై 50 శాతం మొత్తం తిరిగి ఇవ్వబడుతుంది.
  • జూలై1 నుండి తత్కాల్ టిక్కెట్ల నిబంధనలలో మార్పు జరిగింది ఏసీ కోచ్‌కి ఉదయం 10 నుంచి 11 గం. వరకు టికెట్ బుకింగ్, స్లీపర్ కోచ్‌లు కు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గం వరకు బుక్ చేయబడతాయి.
  • రాజధాని, శతాబ్ది రైళ్లలో జూలై 1 నుంచి పేపర్‌ లెస్ టిక్కెట్ సదుపాయం ప్రారంభించ బడుతోంది ఈ సదుపాయం తర్వాత, శతాబ్ది మరియు రాజధాని రైళ్లలో పేపర్ టిక్కెట్లు అందుబాటులో ఉండవు, బదులుగా టికెట్ మీ మొబైల్‌లో పంప బడుతుంది.
  • త్వరలో వివిధ భాషల్లో రైల్వే టికెటింగ్ సౌకర్యం ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు, రైల్వేలో టిక్కెట్లు హిందీ మరియు ఇంగ్లీషులో అందు బాటులో ఉన్నాయి, అయితే కొత్త వెబ్‌సైట్ తర్వాత, ఇప్పుడు టిక్కెట్ల ను వివిధ భాషలలో బుక్ చేసుకోవచ్చు.
  • రైల్వేలో టిక్కెట్ల కోసం ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో జూలై 1 నుంచి శతాబ్ది, రాజధాని రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచనున్నారు.
  • రద్దీ సమయాల్లో మెరుగైన రైలు సౌకర్యాన్ని అందించడానికి ప్రత్యామ్నాయ రైలు సర్దుబాటు వ్యవస్థ, సువిధ రైలు మరియు ముఖ్య మైన రైళ్ల డూప్లికేట్ రైలు రన్నింగ్ ప్రణాళిక చేయ బడింది.
  • రైల్వే మంత్రిత్వ శాఖ జూలై 1 నుండి రాజధాని, శతాబ్ది, దురంతో మరియు మెయిల్-ఎక్స్‌ప్రెస్ రైళ్ల తరహాలో సువిధ రైళ్లను నడపనుంది.
  • జూలై 1 నుంచి ప్రీమియం రైళ్లను రైల్వే పూర్తిగా నిలిపివేయబోతోంది.
  • సువిధ రైళ్లలో టిక్కెట్ల వాపసుపై 50% ఛార్జీ తిరిగి ప్రయాణికుడికి చెల్లించబడుతుంది. ఇది కాకుండా, ఏసీ-2 టైర్ పై రూ.100/-, ఏసీ-3 టైర్ పై రూ.90/-, స్లీపర్‌ క్లాస్ పై ఒక్కో ప్రయాణికుడికి రూ.60/- తగ్గిస్తారు. ప్రజా ప్రయోజనాల కోసం జారీ చేయబడింది.

వేక్అప్ కాల్ ఫీచర్..

వీటన్నింటితో పాటూ రైలులో రాత్రి పూట ప్రయాణం చేసేవారు హెచ్చరిక లేకుండా నిద్రిస్తూ ఉంటారు. దీనికి కారణం తెల్లవారు జామున మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు సదరు ప్రయాణీకుడి డెస్టినేషన్ స్టేషన్ రావడం. దీంతో వారు మెలుకువరాక తాము దిగాల్సిన రైల్వే స్టేషన్ ను దాటవేయాల్సి వస్తుంది. ఇలా జరగడం వల్ల వారు చేరవల్సిన గమ్యస్థానాన్ని కాకుండా మరో గమ్యస్థానాన్ని చేరుకుంటూ ఉంటారు. ఈ మధ్యలో టికెట్ కలెక్టర్ మనల్ని చూస్తే తిరిగి ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై ఆ పరిస్థితులు తలెత్తకుండా సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది రైల్వే. గమ్యస్థానానికి చేరుకునే ముందే రైల్వే సదరు ప్రయాణికుడిని మేలుకునేలా చేస్తుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. 139కి కాల్ చేసి భాషను ఎంచుకుని, ఆపై 7 నంబర్ ను ప్రెస్ చేయండి. ఆ తరువాత మీ టికెట్ లోని పది అంకెల పీఎన్ఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వేకప్ కాల్-డెస్టినేషన్ అలర్ట్ యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల రాత్రి వేళల్లో మన గమ్యస్థాన స్టేషన్‌కు చేరుకునేలోపు రైల్వే వేక్అప్ కాల్- డెస్టినేషన్ అలర్ట్ ఇస్తుంది. అంటే మొబైల్ లో అలారం మ్రోగుతుందనమాట.

ఈ అలర్ట్ ని ఎస్ఎంఎస్ ద్వారా కూడా యాక్టివ్ చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ ఫీచర్‌ని యాక్టివేట్ చేయడానికి. మీ మొబైల్ లో మెసెస్ బాక్స్ ఓపెన్ చేసి అలర్ట్ అని క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చి టికెట్ లోని పది అంకెల పీఎన్ఆర్ నంబర్‌ని నమోదు చేయాలి. దానిని 139కి పంపించాలి. మన సమాచారాన్ని స్వీకరించినట్లు ఒక మెసేజ్ పంపిస్తుంది రైల్వే. దీంతో వేకప్ అలర్ట్ యాక్టివేట్ అయి మన ఊరికి సమీపంలో ఫోన్లో రింగ్ అవుతుంది. దీనిని మనం లేచి ఆఫ్ చేసే వరకూ మ్రోగుతూనే ఉంటుంది. ఇలా ప్రతి ప్రయాణీకుడు తన గమ్యస్థానాన్ని సులువుగా చేరుకోవచ్చు.

T.V.SRIKAR