Chandrayan-3: చందమామకు అటు ఎలా ఉంటుందంటే.. చంద్రయాన్‌ ఫొటోలు చూస్తే మతిపోద్ది..

చంద్రుడిపై కాలుమోపే చారిత్రక ఘట్టం కోసం వడివడిగా అడుగులు వేస్తోంది. మరో రెండు రోజుల్లో దక్షిణ ధ్రువం ఉపరితలంపై ల్యాండ్ కానుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 21, 2023 | 01:04 PMLast Updated on: Aug 21, 2023 | 1:04 PM

Isro Said Via Twitter That The Vikram Lander Took Photos Of The Moon From The Side Not Visible To Earth

నెల రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగు పెట్టేందుకు చంద్రయాన్ 3 ల్యాండర్ సిద్ధమవుతోంది. చంద్రుడిపై కాలుమోపే చారిత్రక ఘట్టం కోసం వడివడిగా అడుగులు వేస్తోంది. మరో రెండు రోజుల్లో దక్షిణ ధ్రువం ఉపరితలంపై ల్యాండ్ కానుంది. ఈ మేరకు సాఫ్ట్ ల్యాండింగ్ కోసం అనువైన ప్రదేశాన్ని విక్రమ్ ల్యాండర్ అన్వేషిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భూమికి ఎప్పుడూ కనిపించని జాబిల్లి అవతలి వైపు.. అంటే దక్షిణ ధ్రువం ఉండే ప్రాంతం చిత్రాలను ల్యాండర్‌‌ తన కెమెరాల్లో బంధించింది. ఈ ఫొటోలను ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. విక్రమ్ ల్యాండర్‌‌కు అమర్చిన ల్యాండర్‌‌ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా, భూమికి కనిపించని వైపు ఫొటోలను తీసింది.

చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు అనువైన ప్రాంతాన్ని గుర్తించేందుకు ఈ కెమెరా సాయపడుతుంది. బండరాళ్లు, కందకాలు లేని ప్రదేశం కోసం ల్యాండర్ వెతుకుతోందని తెలిపింది. 19న ల్యాండర్ ఈ ఫొటోలను తీసినట్లు ఇస్రో తెలిపింది. ఆ ఫొటోలను గమనిస్తే.. చంద్రుడి ఉపరితలంపై అనేక బిలాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వాటి పేర్లను కూడా ఇస్రో చెప్పడం ఇక్కడ హైలైట్. అంతా సవ్యంగా సాగితే 23న సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపుతుందని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. ఈ ఒక్క అడుగు విజయవంతమైతే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన సోవియట్ యూనియన్, అమెరికా, చైనా జాబితాలో భారత్ కూడా చేరుతుంది.