Jr. NTR : అమ్మాయి మాయ మాటలకు మోసపోయిన జూ.ఎన్టీఆర్‌

భూ లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భూమి కొనేటప్పడు చాలా విషయాలు క్రాస్‌ వెరిఫై చేసుకోవాలి. లేదంటే దెబ్బైపోతాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 17, 2024 | 12:40 PMLast Updated on: May 17, 2024 | 12:40 PM

Jr Ntr Was Deceived By Mayas Words

 

 

 

భూ లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భూమి కొనేటప్పడు చాలా విషయాలు క్రాస్‌ వెరిఫై చేసుకోవాలి. లేదంటే దెబ్బైపోతాం. ఇలాంటి విషయాలు చెక్‌ చేసుకోక చాలా మంది భూముల విషయంలో సమస్యలు ఫేస్‌ చేస్తుంటారు. కొనేవాళ్లు కాస్త అమాయకంగా ఉంటే చాలు.. లిటిగేషన్‌ ల్యాండ్లు కట్టబెడుతుంటారు కొంతమంది కేటుగాళ్లు. ఇలాగే ఓ లేడీ ఏకంగా యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ను బురిడీ కొట్టించింది. లిటిగేషన్‌ ప్రాపర్టీ తారక్‌కు అమ్మి.. కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది.

2003లో సంకు గీత అనే ఓ లేడీ నుంచి జూబ్లీహిల్స్‌ సొసైటీలో తారక్‌ 683 గజాల స్థలం కొన్నాడు. రీసెంట్‌గానే అందులో ఇల్లు కట్టడం కూడా ప్రారంభించాడు. కానీ అప్పుడే బ్యాంక్‌ అధికారులు తారక్‌కు షాకిచ్చారు. వెంటనే కన్స్‌ట్రక్షన్‌ నిలిపివేయాలంటూ నోటీస్‌లు జారీ చేశారు. ఎందుకంటే ఆ భూమిపై పలు బ్యాంకుల్లో లోన్లు ఉన్నాయి. 1996లోనే ఆ భూమిని ష్యూరిటీగా పెట్టి.. SBI, ఓరియంటల్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి లోన్లు తీసుకున్నారు ఈ భూమి అమ్మినవాళ్లు. ఆ లోన్లు క్లియర్‌ చేయకుండానే తారక్‌కు భూమి అమ్మేశారు.

ఆ విషయం తెలియక తారక్‌ భూమి తీసుకుని అందులో ఇల్లు కట్టడం ప్రారంభించాడు. ఇప్పుడు ఇంటి నిర్మాణం నిలిపివేసి భూమి బ్యాంక్‌కు ఇచ్చేయాలంటూ DRTలో బ్యాంకులు సవాల్‌ చేశాయి. అన్ని డాక్యుమెంట్స్‌ బ్యాంకులకు అనుకూలంగా ఉండటంతో ట్రిబ్యునల్‌ కూడా బ్యాంకులకు అనుకూలంగానే తీర్పు చెప్పింది. దీంతో తారక్‌ హైకోర్టును ఆశ్రయించాడు. లిటిగేషన్‌ సైట్‌ తనకు అమ్మారంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. తాను భూమిలో ఇంటి నిర్మాణం కూడా మొదలుపెట్టానని.. తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించాడు. మరి హైకోర్ట్‌లో తారక్‌కు న్యాయం జరుగుతుందా లేదా చూడాలి.