SCHOOL TEACHERS : స్కూల్లో తన్నుకున్న టీచర్లు… ఏడుగురికి గాయాలు !

మంచిగా చదువుకోవాలి... ఎవరితో గొడవ పడొద్దు... ఇలాంటి మంచి బుద్దులు చెప్పే విద్యాసంస్థలో టీచర్లే కొట్టుకున్న సంఘటన కేరళలో జరిగింది. విద్యార్థుల ముందే జరిగిన ఈ గొడవలో ఏడుగురు ఉపాధ్యాయులు గాయపడ్డారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 16, 2023 | 05:44 PMLast Updated on: Nov 16, 2023 | 5:53 PM

Kerala School Teachers Fight

Kerala Teachers Clash : స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పి క్రమశిక్షణ నేర్పాల్సిన టీచర్లే క్లాసులు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో కొట్టుకోవడంతో ఏడుగురు టీచర్లు గాయపడ్డారు. కేరళలోని ఓ స్కూల్లో జరిగిన ఈ గొడవ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కేరళలోని (Kerala) ఎరవన్నూరులో ఏయూపీ స్కూల్‌లో ఓ మహిళా టీచర్ పనిచేస్తోంది. ఆమె భర్త మరో స్కూల్‎లో టీచర్. ఆ మహిళా టీచర్ తన స్కూల్‎లో ఓ విద్యార్థిని కొట్టింది. ఉపాధ్యాయుల సమావేశంలో ఆమెను మందలించారు. ఇది తెలుసుకున్న ఆమె భర్త.. భార్య పనిచేస్తున్న స్కూల్‎కి వచ్చి మిగతా టీచర్లతో గొడవకు దిగాడు. టీచర్ల మధ్య మాటా మాట పెరిగింది. ఆ మహిళా టీచర్ భర్త దాడి చేయడంతో మొత్తం ఏడుగురు ఉపాధ్యాయులు (School Teachers) గాయపడ్డారు. ఏయూపీ స్కూల్ టీచర్ల ఫిర్యాదుతో దాడి చేసిన టీచర్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు.. గొడవ జరుగుతున్న సమయంలో కొందరు వీడియో తీశారు.. ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ వీడియోను చూసిన వాళ్ళంతా కామెంట్లు పెడుతున్నారు. వీళ్ళు మన పిల్లలకు విద్యాబుద్ధులు ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ఏయూపీ స్కూల్ పరువు సోషల్ మీడియాకు ఎక్కడంతో తల్లిదండ్రులు యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు.