బ్రేకింగ్: రేవంత్ ఇంటికి మహేష్…!

ఇటీవల తెలుగు రాష్ట్రాలను భారీ వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, తెలంగాణాలో ఖమ్మం జిల్లాలో వరదలు పెద్ద ఎత్తున ప్రజలను ఇబ్బంది పెట్టాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 23, 2024 | 01:00 PMLast Updated on: Sep 23, 2024 | 1:00 PM

Mahesh Babu Meet Cm Revanth Reddy

ఇటీవల తెలుగు రాష్ట్రాలను భారీ వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, తెలంగాణాలో ఖమ్మం జిల్లాలో వరదలు పెద్ద ఎత్తున ప్రజలను ఇబ్బంది పెట్టాయి. ఈ నేపధ్యంలో రెండు రాష్ట్రాలకు సినీ పరిశ్రమ భారీగా విరాళాలు ప్రకటించింది. ఒక్కొక్కరిగా సినిమా స్టార్ లు ముఖ్యమంత్రులకు విరాళం అందిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు… వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి గానూ రూ.50 లక్షల చెక్కును అందించారు. మహేష్ తో పాటుగా ఆయన సతీమణి నమ్రత కూడా ఉన్నారు.