Manickam Tagore: సీఎం పోస్టుకు 50 కోట్లు.. ఆరోపించిన కేటీఆర్.. నోటీసులు పంపిన మాణిక్కం ఠాగూర్

ఢిల్లీ మేనేజ్‌మెంట్ కోటాలో సీఎం అయ్యాడనీ, అందుకోసం కోసం మానిక్కం ఠాగూర్‌కి 50 కోట్లు ఇచ్చినట్టు సిరిసిల్లలో కేటీఆర్ కామెంట్స్ చేశారు. అయితే కేటీఆర్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ లీగల్ నోటీస్ పంపారు మానిక్కం ఠాగూర్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2024 | 02:00 PMLast Updated on: Jan 31, 2024 | 2:00 PM

Manickam Tagore Sent Legal Notices To Ktr Over Defamation Case

Manickam Tagore: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్కమ్ ఠాగూర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయలు పెట్టి సీఎం పోస్ట్ కొన్నారని కేటీఆర్ కామెంట్ చేయడంపై ఈ నోటీసులు పంపారు. రేవంత్.. ఢిల్లీ మేనేజ్‌మెంట్ కోటాలో సీఎం అయ్యాడనీ, అందుకోసం కోసం మానిక్కం ఠాగూర్‌కి 50 కోట్లు ఇచ్చినట్టు ఆరోపించారు. సిరిసిల్లలో జరిగిన సమావేశంలో కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు. అయితే కేటీఆర్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ లీగల్ నోటీస్ పంపారు మానిక్కం ఠాగూర్. ఆ నోటీసులు Xలో ట్వీట్ చేశారు.

అసలు రేవంత్ రెడ్డి.. సీఎం అయినప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌కి తాను ఇంఛార్జ్‌ని కాదన్నారు. రేవంత్ నన్ను ఎక్కడా కలవలేదని నోటీసులో తెలిపిన ఠాగూర్.. తెలంగాణ శాసనసభ్యులే రేవంత్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారని తెలిపారు. కేటీఆర్ తన పరువుకు భంగం కలిగించారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు మాణిక్కమ్ ఠాగూర్. సోషల్ మీడియాలో ప్రచారం చేసి తన పరువు తీస్తున్నారని న్యాయవాది ద్వారా పంపిన నోటీసులో పేర్కొన్నారు. కేటీఆర్ వారంలోగా క్షమాపణ చెప్పాలని మానిక్కమ్ ఠాగూర్ డిమాండ్ చేశారు. లేకపోతే మధురై కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ కొడుకు అంటూ నోటీసులో పేర్కొన్నారు మానిక్కమ్ ఠాగూర్. గతంలో BRS ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కౌశిక్ రెడ్డిపైనా మధురై కోర్టులో పరువు నష్టం దావా వేశారు మానిక్కమ్ ఠాగూర్. అప్పట్లో ఇద్దరూ కోర్టుకి వచ్చిన ఫోటోలను మరోసారి షేర్ చేశారు.
నోటీసులు కోమటిరెడ్డికి పంపండి: కేటీఆర్
కాంగ్రెస్ తెలంగాణ మాజీ ఇంచార్జ్ మాణికం ఠాకూర్ లీగల్ నోటీసులపై Xలో స్పందించారు కేటీఆర్. మానిక్కం ఠాగూర్ అయోమయంలో ఉన్నారన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే రేవంత్ రెడ్డి మాణిక్కం ఠాగూర్‌కు 50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నారని చెప్పిన మాట గుర్తు చేశారు కేటీఆర్. పెద్ద ఎత్తున మీడియాలో వచ్చిన 50 కోట్ల లంచం వార్తలనే తాను ప్రస్తావించానన్నారు కేటీఆర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీపై చేసిన ఆరోపణలను ఇప్పటి దాకా వెనక్కి తీసుకోలేదని తెలిపారు. 50 కోట్ల లంచం కామెంట్స్‌పై వివరణ కూడా ఇవ్వలేదన్నారు కేటీఆర్. మీరు పంపే పరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుందని మానిక్కమ్ ఠాగూర్‌కి సలహా ఇచ్చారు కేటీఆర్. తన చిరునామాకి కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి ఈ నోటీసులు పంపించండని సూచించారు.