వరుసగా నాలుగో సెంచరీ, దుమ్మురేపుతున్నమయాంక్
జాతీయ జట్టుకు దూరమైన మయాంక్ అగర్వాల్ ఇటీవల ఐపీఎల్ వేలంలోనూ అన్ సోల్డ్ గా మిగిలాడు.ఈ కర్ణాటక బ్యాటర్ గురించి అందరూ మర్చిపోయిన తరుణంలో ఒక్కసారిగా దూసుకొచ్చాడు.

జాతీయ జట్టుకు దూరమైన మయాంక్ అగర్వాల్ ఇటీవల ఐపీఎల్ వేలంలోనూ అన్ సోల్డ్ గా మిగిలాడు.ఈ కర్ణాటక బ్యాటర్ గురించి అందరూ మర్చిపోయిన తరుణంలో ఒక్కసారిగా దూసుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో వరుస సెంచరీలతో మోత మోగిస్తున్నాడు. 5 మ్యాచ్ ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు చేసి టీమిండియా సెలక్టర్లకు ఛాలెంజ్ విసిరాడు. నాగాలాండ్తో జరిగిన మ్యాచ్లో 119 బంతుల్లో అజేయంగా 116 పరుగులు చేసి నాలుగో సెంచరీ సాధించాడు. పంజాబ్తో మ్యాచ్ లో 139 , అరుణాచల్ ప్రదేశ్ పై 100 ,హైదరాబాద్పై 124 , సౌరాష్ట్రపై హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్లలో 153.25 సగటు.. 111.66 స్ట్రైక్ రేట్తో 613 పరుగులు చేశాడు. మయాంక్ సూపర్ ఫామ్ సెలక్టర్లకు ఒక విధంగా తలనొప్పిగా మారిందనే చెప్పాలి.