ప్రెస్ ముందు మంత్రి తుమ్మల కన్నీళ్లు…!

మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కన్నీటి పర్యంతం అయ్యారు. సీతారామ ప్రాజెక్ట్ విషయంలో మంత్రి లక్ష్యంగా హారీష్ రావు ఆరోపణలు చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 13, 2024 | 11:33 AMLast Updated on: Aug 13, 2024 | 11:33 AM

Ministers Tears In Front Of The Press

మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కన్నీటి పర్యంతం అయ్యారు. సీతారామ ప్రాజెక్ట్ విషయంలో మంత్రి లక్ష్యంగా హారీష్ రావు ఆరోపణలు చేసారు. క్రెడిట్ కోసం పేరు కోసం తుమ్మల ఎప్పుడూ ఆరాట పడలేదు అన్నారు తుమ్మల. ప్రజల కోసం మాత్రమే ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడం కోసమే పని చేశా అంటూ తుమ్మల స్పష్టం చేసారు.

మేం చేస్తే క్రెడిట్ మీరు తీసుకున్నారు అంటూ హరీష్ మాట్లాడటం పట్ల తుమ్మల ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజాస్వామ్య దేశంలో మీది మాది ఉండదు అంటూ స్పష్టం చేసారు. ప్రెస్ మీట్ ఆసాంతం తుమ్మల కన్నీరు పెట్టుకుంటూ మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో గాలేరు నగరి, హంద్రి నీవా సహా చాలా ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం అయ్యే అవకాశం వచ్చినా ఏ రోజు తాను క్రెడిట్ కోసం చూడలేదు అని స్పష్టం చేసారు. ఎవరి కీర్తి ,మెప్పు కోసమో పని చేయను అన్నారు.

జిల్లాలో గతంలో వివిధ పార్టీ ల నేతలు చేపట్టిన పనులు పూర్తి చేశాను అని తెలిపారు. నా స్వార్థం కోసం,నా రాజకీయం కోసం పనులు చేయలేదు అన్నారు మంత్రి. ఈ లపంగి రాజకీయాలు నాకు అవసరం లేదు అని స్పష్టం చేసారు. మీరు కూడా రేపు 15 న జిల్లాకు రండి.. మీ నెత్తిన నీళ్ళు చల్లుకోండి అన్నారు.