బ్రేకింగ్: హర్షాసాయి కేసులో పోకిరి మాదిరి ట్విస్ట్

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం ఒక యువతీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన దగ్గరి నుంచి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 25, 2024 | 11:18 AMLast Updated on: Sep 25, 2024 | 11:18 AM

Narsingi Police File Rape Case On Harsha Sai

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం ఒక యువతీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన దగ్గరి నుంచి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హర్ష సాయి మీద రేప్ కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు… ప్రేమా పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేసాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. హర్షా సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనితో హర్ష సాయి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. హర్ష సాయికి సంబంధించిన అన్ని ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి.

నిన్నటి నుండి హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ అందుబాటులో లేకుండా పోయాడు. బాధితురాల నుండి కొన్ని ఆధారాలను సేకరించిన నార్సింగ్ పోలీసులు… వాటి ఆధారంగా రేప్ కేసు నమోదు చేసారు. మరి కొన్ని ఆధారాలను సమర్పించాలని బాధితురాలిని పోలీసులు కోరినట్టు సమాచారం. హర్ష సాయి నుండి అతని ఫాలోవర్స్ నుండి ప్రాణ హాని ఉందంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమ, పెళ్లి పేరుతో లొంగదీసుకుని నగ్న వీడియోలను ,నగ్న చిత్రాలను పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశాడు అని ఫిర్యాదులో పేర్కొంది.

నార్సింగి పోలిస్ స్టేషన్ లో 376, 354 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఇదే సమయంలో ఒక విషయం బయటకు వచ్చింది. ‘ మెగా ‘ సినిమా కు సంబంధించిన కాపీ రైట్స్ కోసం హర్ష సాయి తెగించినట్టు సమాచారం. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా బాధితురాలు వ్యవహరించిందని పోలీసులు గుర్తించారు. కాపీ రైట్స్ విషయం పై ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. బాధితురాలికి మత్తు మందు ఇచ్చి హర్ష సాయి అత్యాచారం చేసినట్టు గుర్తించారు. బాధితురాలి వీడియోలు సీక్రెట్ గా రికార్డు చేసిన హర్ష సాయి… వాటితో ఆమెను బెదిరించాడని గుర్తించారు. సినిమా కాపీ రైట్స్ ఇవ్వకుంటే విడియో లు బయట పెడతానని హర్ష సాయి బ్లాక్ మెయిల్ చేసినట్టు విచారణలో వెల్లడి అయింది. కాగా మంగళవారం సాయంత్రం బాధితురాలు… అడ్వకేట్ తో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.