Parliament Budget : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో మధ్యాహ్నం గం.1కు, రాజ్యసభలో మధ్యాహ్నం గం.2కు ఈ సర్వేను ప్రవేశపెడతారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 22, 2024 | 01:15 PMLast Updated on: Jul 22, 2024 | 1:15 PM

Parliament Budget Meetings Nirmala Sitharaman Will Introduce The Budget

కేంద్రంలరో మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్డీఏ ప్రభుత్వం నేడు పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో ఆరు బిల్లులను సభామోదం కోసం ప్రభుత్వం తీసుకురానుంది.

నేడు పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థికమంత్రి..

ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో మధ్యాహ్నం గం.1కు, రాజ్యసభలో మధ్యాహ్నం గం.2కు ఈ సర్వేను ప్రవేశపెడతారు. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. FY24 (2023-24)లో భారత్ ఆర్థిక స్థితి, సాధించిన వృద్ధి మొదలైన అంశాలపై ఈ సర్వే అవగాహన కల్పిస్తుంది. బడ్జెట్‌ను అంచనా వేయడంలోనూ ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. మంగళవారం నాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్​కు సంబంధించిన 2024 బడ్జెట్ కూడా జూలై 23నే పార్లమెంట్​కు సమర్పించనున్నారు. మరోవైపు నీట్ పేపర్ లీకేజీ, రైలు ప్రమాదాలు, కన్వర్ యాత్ర ఘటన వంటి అంశాలను విపక్షాలు లేవనెత్తనున్నాయి. మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతోంది. ఈ సందర్భంగా వీటిపై చర్చ జరపాలని లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల బడ్జెట్ ప్రవేశపెడతారు.

Suresh SSM