బ్రేకింగ్: జగన్ పోర్క్ తింటారు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ పై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై హాట్ కామెంట్స్ చేసారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ వి ఎస్ ఎన్ వర్మ. జగన్మోహన్ రెడ్డికి ఫోర్ కు తినడం అలవాటు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 24, 2024 | 01:34 PMLast Updated on: Sep 24, 2024 | 1:34 PM

Pithapuram Ex Mla Hot Comments

తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ పై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై హాట్ కామెంట్స్ చేసారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ వి ఎస్ ఎన్ వర్మ. జగన్మోహన్ రెడ్డికి ఫోర్ కు తినడం అలవాటు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సాక్షాత్తు ప్రపంచ ఇలవేల్పుగా కొలిచే వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఫోర్క్ కొవ్వును కలపించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు అని మండిపడ్డారు. 15 లీటర్ల పాలు కాస్తేనే కానీ కేజీ నెయ్యి తయారు అవ్వదు, అటువంటిది 320 రూపాయలుకి ఒక కేజీ నెయ్యి ఎలా సప్లై చేయగలుగుతున్నారు అనేది గమనించకపోవడం బాధాకరం అన్నారు.

రానున్న రోజుల్లో క్వాలిటీ నెయ్యి తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో గుర్తించి దానికంటే తక్కువకు టెండర్ వేసిన టెండర్ దారులను బ్లాక్ లిస్టులో పెట్టాలి అని డిమాండ్ చేసారు. కల్తీ జరిగిన సమయంలో ఉన్న కాంట్రాక్టర్లు అందరిని కూడా పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయాలి అని కోరారు. టెంపుల్ ల్లో జరిగే కార్యక్రమాల్లో కాని, తీర్థ ప్రసాదల్లో కానీ అవినీతికి పాల్పడిన వారిపై పిడి యాక్టులో కేసులు పెట్టాలి అన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కాంట్రాక్టర్లు నువ్వు ప్రసాదంలో ఏమైనా కలుపుకో నాకు ఎంత ఇస్తావు అనే ధోరణిలో టెండర్లు సాగయి అని మేము పురుగుల మందు ఇస్తే జగన్మోహన్ రెడ్డి తాగుతారా అని నిలదీశారు.