Venuswamy : కల్కీలో హీరో ఎవరు ? వేణుస్వామి ఇంకా తగ్గలేదు

పొలిటికల్, సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే గెలుపు.. ఇది తథ్యం అంటూ వేణుస్వామి చెప్పిన ప్రెడిక్షన్ తేడా కొట్టడంతో కొంత కాలంగా ఇంటర్వ్యూలకి దూరంగా ఉన్నారు వేణుస్వామి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 11, 2024 | 10:30 AMLast Updated on: Jul 11, 2024 | 10:30 AM

Political And Celebrity Astrologer Venuswamy Is Trending Once Again

 

 

 

పొలిటికల్, సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే గెలుపు.. ఇది తథ్యం అంటూ వేణుస్వామి చెప్పిన ప్రెడిక్షన్ తేడా కొట్టడంతో కొంత కాలంగా ఇంటర్వ్యూలకి దూరంగా ఉన్నారు వేణుస్వామి. కానీ సోషల్ మీడియాలో మాత్రం తనపై వస్తున్న ట్రోలింగ్‌కి గట్టిగానే సమాధానమిచ్చారు. అయితే చాలా రోజుల తర్వాత మరోసారి ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు వేణుస్వామి.

ఈసారి ప్రభాస్‌ విషయంలో మళ్లీ హాట్ కామెంట్లు చేశారు. రాధేశ్యామ్, సాహో, ఆదిపురుష్ డిజాస్టర్లు అయినప్పుడు నాకు ఎవరూ దండేయలేదు కదా.. కిరీటం పెట్టలేదు కదా అంటూ కౌంటర్లు వేశారు. ఇక ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘కల్కి’పై కాంట్రవర్షియల్ కామెంట్లు చేశారు. ప్రభాస్‌కు హిట్టే రాదు అన్నారు కల్కి హిట్‌ అయ్యింది అని చెప్పడంతో ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బాహుబలి 2 తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయ్.. మరి అప్పుడు నేను చెప్పింది నిజమైందని ఎవరైనా వచ్చి నా మెడలో దండేశారా ? నాకు కిరీటాలు పెట్టారా? ఇక సలార్ చిత్రం హిట్ అంటూ ఫ్యాన్స్ తెగ ఎగిరారు కదా ? అది నిజంగా హిట్టా ? సలార్‌కి 135 కోట్లు లాస్ వచ్చింది. ఈ విషయం ఎవరైనా చెప్పారా ? కల్కి చిత్రం బ్లాక్ బస్టర్ అంటున్నారు.. అందులో హీరో ఎవరు.. ప్రభాస్ ఎంతసేపు స్క్రీన్ మీద కనిపించారు. ఆ సినిమా చివరికి నిర్మాతకి ఎన్ని డబ్బులు తెచ్చిపెడతాయో చూద్దాం. అయినా ప్రభాస్ మళ్లీ మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి చిత్రాలు చేయగలరా ? అలాంటి పరిస్థితి లేదు” అంటూ మరోసారి రెచ్చిపోయారు వేణుస్వామి.

ఇక ప్రభాస్‌ జాతకం గురించే తాను మాట్లాడతానని.. వ్యక్తిగతంగా ఆయనతో తనకి ఎలాంటి శత్రుత్వం లేదని వేణుస్వామి అన్నారు. పైగా ప్రభాస్ తనకి చాలా క్లోజ్ అని.. అప్పుడప్పుడూ తన మేనేజర్ కూడా కాల్ చేస్తారంటూ వేణుస్వామి చెప్పుకొచ్చారు. “ప్రభాస్ ఫ్యాన్స్ అంతా నన్ను ట్రోల్ చేస్తారు. కానీ ప్రభాస్ నాకు చాలా క్లోజ్. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత నన్ను అందరూ ట్రోల్ చేసినప్పుడు ప్రభాస్ నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. మీరు చాలా ధైర్యంగా ఉన్నారండి అని నాతో అన్నారు. ఇక మా ఫామ్ హోస్‌లో పండిన సీతాఫలాల్ని నేను ప్రభాస్‌కి మొన్నే పంపించా. ఇక నేను పెట్టుకునే కళ్లద్దాలు బాగున్నాయ్ .. ఎక్కడ కొన్నారని ప్రభాస్ అడిగారంటూ వాళ్ల మేనేజర్ కూడా కాల్ చేశారు. ఇవన్నీ ఫ్యాన్స్‌కి తెలియవు. ప్రభాస్ గురించి ఏం చెప్పినా అతను అసలు పట్టించుకోడు. చెప్పేవి మన మంచికే కదా అని అంటాడు.” అంటూ కవరింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు వేణుస్వామి. మరి ఈసారి డార్లింగ్‌ ఫ్యాన్స్‌ వేణుస్వామిని ఎలా ట్రీట్‌ చేస్తారో చూడాలి.