REVANTH REDDY: శ్రీరాం సాగర్ చూపించి ఓట్లడుగుతాం.. కాళేశ్వరం చూపించి ఓట్లడుగుతావా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్..

వందరోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి పదేళ్లయినా హామీ నెరవేర్చలేదు. కవితను ఇక్కడి రైతాంగం బండకేసి కొట్టారు. అందుకే అప్పటి నుంచి కేసీఆర్ ఈ ప్రాంత రైతులపై కక్ష కట్టిండ్రు. బాజిరెడ్డి గోవర్ధన్ నిర్లక్ష్యంతో ఆర్టీసీ కార్మికుల హక్కులను కాలరాశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 22, 2023 | 03:31 PMLast Updated on: Nov 22, 2023 | 3:31 PM

Revanth Reddy Challenges Cm Kcr Over Kaleswaram Project

REVANTH REDDY: తాము కట్టిన శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు చూపించి.. ఓట్లడుగుతామని.. కేసీఆర్‌కు దమ్ముంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు చూపించి ఓట్లు అడగగలడా అని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నిజామాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. “ఈ ఎన్నికలు ఆశామాషీ ఎన్నికలు కాదు. పదేళ్లలో పోడు భూముల సమస్య తీర్చలేదు. లంబాడాలను ఆదుకోలేదు. మంచిప్ప ప్రాజెక్టును పూర్తిచేయలేదు. వందరోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి పదేళ్లయినా హామీ నెరవేర్చలేదు. కవితను ఇక్కడి రైతాంగం బండకేసి కొట్టారు.

KCR: కేసీఆర్‌లో కంగారు.. నేతలకు వరుస ఫోన్లు.. ఓటమి భయమా..? జాగ్రత్తా..?

అందుకే అప్పటి నుంచి కేసీఆర్ ఈ ప్రాంత రైతులపై కక్ష కట్టిండ్రు. బాజిరెడ్డి గోవర్ధన్ నిర్లక్ష్యంతో ఆర్టీసీ కార్మికుల హక్కులను కాలరాశారు. 50 మంది ఆర్టీసీ కార్మికులను పొట్టనబెట్టుకున్నారు. కేసీఆర్‌కు పదవి పోతుందన్న భయంపట్టుకుంది. మతి తప్పి మాట్లాడుతుండో.. మందేసి మాట్లాడుతుండో తెలియదు. కాంగ్రెస్‌కు 20 సీట్లు కూడా రావని కేసీఆర్ మాట్లాడుతుండు. నిజామాబాద్ సాక్షిగా కేసీఆర్‌కు చెబుతున్నా.. 80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గకుండా ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తారు. 80కి ఒక్క సీటు తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం. బక్కోన్ని బక్కోన్ని అని చెప్పుకునే కేసీఆర్.. లక్ష కోట్లు దిగమింగాడు. 10వేల ఎకరాలు ఆక్రమించుకున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలి. నిజామాబాద్ జిల్లా రైతులు ఆత్మ గౌరవంతో బ్రతుకుతారు. ఆర్టీసీ కార్మికులను పొట్టనపెట్టుకున్న బాజిరెడ్డి గోవర్ధన్‌ను వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నుంచి అధిష్టానం నన్ను బరిలోకి దించింది.

నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎటువైపు ఉంటారో.. ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. జిల్లాలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును చూపించి మేం ఓట్లు అడుగుతాం. కాళేశ్వరం, మేడిగడ్డను చూపించి కేసీఆర్ ఓట్లు అడగగలవా..? దమ్ముంటే కేసీఆర్ నా సవాల్ స్వీకరించాలి. కేసీఆర్ గుర్తుపెట్టుకో.. నీ దొరల రాజ్యాన్ని, దొంగల రాజ్యాన్ని పొలిమేరల వరకు తరిమి బొందపెడతాం. బరాబర్ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం” అని రేవంత్ వ్యాఖ్యానించారు.