దమ్ముంటే రండ్రా, రేవంత్ మాస్ వార్నింగ్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆరెస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదు అని మండిపడ్డారు. సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నారు అంటూ మండిపడ్డారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 20, 2024 | 12:54 PMLast Updated on: Aug 20, 2024 | 12:54 PM

Revanth Reddy Fires On Brs Leaders

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆరెస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదు అని మండిపడ్డారు. సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నారు అంటూ మండిపడ్డారు. సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదు అన్నారు. అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారని చేతనైతే ఎవడైనా విగ్రహం చేయి వేయండి అంటూ సవాల్ చేసారు.

నీ అయ్య విగ్రహం కోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా? అంటూ ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. అధికారంలోకి వస్తే అని మాట్లాడుతున్నాడు… బిడ్డా.. మీకు అధికారం ఇక కలనే.. ఇక మీరు చినతమడకకే పరిమితం అంటూ తన మార్క్ కామెంట్స్ చేసారు రేవంత్. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారు అని అన్నారు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాది అని స్పష్టం చేసారు.

మా చిత్తశుద్ధిని ఏ సన్నాసి శంకించనవసరం లేదు అన్నారు ఆయన. విచక్షణ కోల్పోయి అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుంది అంటూ హెచ్చరించారు. సచివాలయం ముందు దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదు అన్నారు సిఎం.