చావు ఇలా కూడానా… కన్నీళ్లు పెట్టించే ప్రమాదం

చావు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఉన్నపళంగా ప్రాణాలు కోల్పోయే వారు ఎందరో. తాజాగా అనంతపురంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం చూసి అక్కడున్న వాళ్ళు కన్నీరు పెట్టారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 23, 2024 | 04:01 PMLast Updated on: Sep 23, 2024 | 4:01 PM

Road Accident In Ananthapuram

చావు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఉన్నపళంగా ప్రాణాలు కోల్పోయే వారు ఎందరో. తాజాగా అనంతపురంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం చూసి అక్కడున్న వాళ్ళు కన్నీరు పెట్టారు. నేషనల్ పార్క్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం నుంచి నాగర్ కోయిల్ కు వెళ్తున్న టమోటా లోడ్ ఐచర్ వాహనం బోల్తా పడింది. ఐచర్ వాహనం పక్కనే ద్విచక్ర వాహనంపై భార్యాభర్తలు వెళ్తున్నారు.

అదుపు తప్పి ద్విచక్ర వాహనంపై మినీ లారి పడిపోయింది. దీనితో అక్కడికక్కడే భార్యా భర్తలు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మృతులు గుత్తి మండలం హనుమంతు రెడ్డి పల్లి గ్రామానికి చెందిన వారిగా ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి తరలించారు.