Salaar : బోర్లా పడ్డ సలార్‌.. ప్రశాంత్ నీల్ దెబ్బేసేసాడు భయ్యా..!

బాహుబలి-2 తర్వాత ప్రభాస్ బాక్సాఫీస్ ఆకలిని తీర్చే సరైన సినిమా పడలేదు. ఆ లోటుని సలార్ తీరుస్తుందని ఆయన అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా బలంగా నమ్మారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ లోకి ఎంటర్ కావాల్సిందే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 22, 2023 | 10:28 AMLast Updated on: Dec 22, 2023 | 10:28 AM

Salar Fell Like A Ball Prashant Neel Was Hurt

 

బాహుబలి-2 తర్వాత ప్రభాస్ బాక్సాఫీస్ ఆకలిని తీర్చే సరైన సినిమా పడలేదు. ఆ లోటుని సలార్ తీరుస్తుందని ఆయన అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా బలంగా నమ్మారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ లోకి ఎంటర్ కావాల్సిందే.

బాహుబలితో ప్రభాస్‌ రేంజ్‌ పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోయింది. డార్లింగ్ సినిమాల బడ్జెట్‌ రేంజ్‌ కూడా అమాంతం పెరిగిపోయింది. అయితే.. ప్రభాస్‌కు బాహుబలి తర్వాత ఆ రేంజ్‌ హిట్ పడలేదు.. దీంతో.. ప్రభాస్‌ కటౌట్‌ తగ్గ హిట్‌ కోసం ఫ్యాన్స్‌ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. కేజీఎఫ్‌తో రికార్డుల బాక్సులు బద్దలు కొట్టిన క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీళ్లిద్దరి కాంబో బాక్సాఫీస్ దాహం తీరుస్తుందనుకున్నారు. అయితే.. సలార్ బొమ్మ పడగానే ఫ్యాన్స్ మళ్లీ డీలా పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రశాంత్ నీల్ దెబ్బేసేసాడు భయ్యా అంటూ డార్లింగ్ ఫ్యాన్స్‌ డిజప్పాయింట్ అవ్వాల్సి వస్తోంది. ఏదో జరిగింది అనుకుంటే ఇంకేదో జరిగిందంటూ ఫ్యాన్స్ గోల పెడుతున్నారు. ఈ సినిమా కేవలం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కోసమే అన్న టాక్ బయటకు రావడంతో ఈ సినిమాపై ఏర్పడ్డ భారీ అంచనాలు కాస్తా తలకిందులయ్యాయి. ఇంతకీ ఈ సినిమా ఎక్కడ దెబ్బ కొట్టింది..? ప్రశాంత్ నీల్ ఎక్కడ ఫెయిలయ్యాడు అన్నది తెలుసుకునే ముందు.. సలార్ మూవీ స్టోరీ ఏంటో చూద్దాం..

సలార్‌ కథ మొత్తం ఖాన్సార్ సామ్రాజ్యం చుట్టూ తిరుగుతుంది. రాజమన్నార్, దేవా అనే ఇద్దరు ఫ్రెండ్స్. తమ స్నేహం కోసం ఎలా ముందుకు వెళ్తారు అనేదే ఈ సినిమా స్టోరీ. ఇది మొదటి పార్ట్. కేజీఎఫ్‌ తరహా లోనే ఖాన్సార్ సామ్రాజ్యానికి అధిపతి అవ్వాలని అంతా ట్రై చేస్తూ ఉంటారు. రాజమన్నార్ కూడా ప్రయత్నం చేసి ఓడిపోతాడు. అయితే.. అందులో గెలవడం కోసం తన స్నేహితుడైన దేవా సాయం కోరతాడు. రాజమన్నార్ ఓడిపోవడంతో పాటు దేవా ఎంట్రీ ఇస్తాడు. అదిరిపోయే మాస్ కటౌట్ తో దేవా ఎంట్రీ ఇస్తాడు. దేవా ఎంట్రీతో సినిమా స్పీడందుకుంటుంది. అంతేకాక తన ఫ్రెండ్ శత్రువులందరిని దేవా అడ్డుతొలగించి ఖాన్సార్ ను రాజమన్నార్ సొంతం చేస్తాడు. కట్ చేస్తే రాజ్యం కోసమే రాజమన్నార్ తనని వాడుకుని మోసం చేసాడని దేవా తెలుసుకుంటాడు. దీనితో కథ మలుపు తిరుగుతుంది. దేవా తన స్నేహితుడికి ఎలా బుద్ధి చెప్పాడు అనేదే స్టోరీ. ఖాన్సార్ ను దేవా ఎలా సొంతం చేసుకుంటాడు. మోసాన్ని తెలుసుకున్న తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మిగిలిన స్టోరీ. మొదటి పార్ట్ చూసిన తర్వాత రెండవ పార్ట్ లో ఏమి జరుగుతుంది అనే ఉత్కంఠ నెలకొంటుంది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ‘గేమ్ అఫ్ థ్రోన్స్’ స్పూర్తితో ఈ సినిమా కథ రాసుకున్నట్టుగా వుంది. ఈ కథ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ యాక్షన్ ప్రధానంగా ఈ సినిమాని నిర్మించాడు. ఇందులో పోరాట సన్నివేశాలు చాలా అత్యున్నత సాంకేతికతని ఉపయోగించి చేశారు. అందుకనే ఆ పోరాట సన్నివేశాలు, కథానాయకుడు అయిన ప్రభాస్ ఎలివేషన్ సన్నివేశాలు అన్నీ బాగా తీసాడు ప్రశాంత్ నీల్.. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ని కేవలం యాక్షన్ స్టార్‌గా మాత్రమే చూపించే ప్రయత్నం చేశాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమా మొత్తం అంతా కలిపి ప్రభాస్‌కు ఒక పది మాటలు ఉన్నాయంటే.. యాక్షన్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.. రెండో సగంలో కుర్చీ కోసం వివిధ తెగలకు చెందిన నాయకులు కుతంత్రాలు పన్నడం, ఎక్కడి నుండో వందలకొద్దీ ఆర్మీని తీసుకురావటం ఇవన్నీ మరీ సినిమాటిక్ గా వున్నాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ నేరేట్ చేసేటప్పుడు చాలా తొందరగా ఆ సన్నివేశాలు వెళ్లిపోవటంతో ప్రేక్షకుడు కన్‌ఫ్యూజ్‌ అవుతున్నాడన్న ఫీడ్‌ బ్యాక్ వినిపిస్తోంది. ‘కేజీఎఫ్’ సినిమాలో ఉన్నట్టుగానే ఈ సినిమాలో కూడా వెనకాల అంతా బొగ్గు గనులు లాంటివి కనపడుతూ ఉండడంతో.. ప్రేక్షకులు కేజీఎఫ్‌ సినిమాను చూస్తున్న ఫీలింగ్‌లోనే ఉండిపోతున్నారు.

ఇక ప్రభాస్‌ హైట్‌కి తగ్గట్లుగా ఎలివేట్ చేయడంపైనే దర్శకుడు కాన్సెన్‌ట్రేట్ చేసినట్లు అనిపిస్తుంది.. ప్రభాస్ కూడా సినిమాలో సీరియస్ గా ఉంటారు, దానికి బాగా సెట్ అయ్యారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విరామం ముందు వస్తాడు, అతను కూడా బాగా చేసాడు. అతనికి, ప్రభాస్ కి మధ్య వున్న సన్నివేశాలు ఆకర్షణీయంగా ఉంటాయి. శృతి హాసన్ పాత్ర చాలా కీలకం.. ఇక జగపతి బాబు కూడా రెండో సగంలో వస్తాడు. అతనికీ రెగ్యులర్ పాత్రే ఇచ్చారు. ఫైనల్‌గా చెప్పాలంటే.. ఈ సినిమా కేవలం ప్రభాస్ అభిమానులను అలరిస్తుందని చెప్పాలి. ఇక ప్రభాస్‌ మొదటి 20 నిమిషాల వరకు కనిపించకపోవడం.. అలాగే రెండో సగంలో కూడా తక్కువగానే కనిపిస్తాడు. దానికితోడు ప్రభాస్ కి డైలాగ్స్ ఎక్కువ లేకపోవడంతో.. ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా బాగా డిజప్పాయింట్ అవుతున్నారు. మొత్తానికి సలార్ మూవీ కాస్తా బోర్లా పడడంతో.. ప్రశాంత్ నీల్ దెబ్బేసేశాడంటున్నారు డై హార్డ్ ఫ్యాన్స్..