ఇన్‌స్టాగ్రామ్‌ పిచ్చిలో దొంగగా మారిన హీరోయిన్‌..

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు.. అవుతున్నారు కూడా. ఒక్క వీడియోతో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. యూట్యూబ్ (Youtube), ఇన్‌స్టా‌గ్రామ్ (Instagram) ద్వారా షాట్స్, రీల్స్ చేస్తూ నేమ్, ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఒక్క వీడియో క్లిక్ అయితే చాలు.. స్టార్ స్టేటస్ కూడా వీరి సొంతమౌతుంది. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు కూడా కొల్లగొడుతున్నారు. కానీ విశాఖ కు చెందిన ఈ అమ్మడి రూటే సెపరేట్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 3, 2024 | 10:27 AMLast Updated on: Mar 03, 2024 | 10:27 AM

The Heroine Who Became A Thief In Instagram Madness

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు.. అవుతున్నారు కూడా. ఒక్క వీడియోతో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. యూట్యూబ్ (Youtube), ఇన్‌స్టా‌గ్రామ్ (Instagram) ద్వారా షాట్స్, రీల్స్ చేస్తూ నేమ్, ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఒక్క వీడియో క్లిక్ అయితే చాలు.. స్టార్ స్టేటస్ కూడా వీరి సొంతమౌతుంది. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు కూడా కొల్లగొడుతున్నారు. కానీ విశాఖ కు చెందిన ఈ అమ్మడి రూటే సెపరేట్. నటిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాల్సిన ఈ సమయంలో చేతివాటం ప్రదర్శించి జైలు పాలయ్యింది ఓ సెలబ్రిటీ. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్, నటి సౌమ్య శెట్టి అలియాస్ సౌమ్య కిల్లంపల్లి.. దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… ఈ కిలాడీ లేడీ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

గత నెల 23న దొండపర్తి ప్రాంతం బాలాజీ మెట్రో రెసిడెన్సీ (Balaji Metro Residency) లోని ఫ్లాట్‌ నంబర్‌ 102లో భారీ చోరీ జరిగింది. ఈ ఇంట్లోని బీరువాలో సుమారు వంద తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లు ఇంటి యాజమాని ప్రసాద్ బాబు.. పోలీసులకు పిర్యాదు చేసారు. డీసీపీ క్రైం వెంకటరత్నం ఆధ్వర్యంలో ఏడీసీపీ గంగాధర్‌ ఇంటికి చేరుకోని ఇళ్లుతో పాటు ఇంట్లో బీరువాను పరిశీలించారు. బీరువాపై ఉన్న వేలిముద్రలను క్లూస్‌ టీం సేకరించింది. ఫ్లాట్‌ బయట ఉన్న సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ఫ్లాట్‌ యాజమాని జనపాల ప్రసాద్‌బాబుతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ మధ్య కాలంలో వారి ఇంటికి వచ్చిన వారి వివరాలు అడిగారు. కాగా.. బాధితుడు 11 మందిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి.. 11 మందిపై విచారణ ప్రారంభించారు.

ఇందులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. గోపాలపట్నంకు చెందిన సౌమ్యశెట్టి.. ఇన్‌స్టాలో వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది. ఆమె ట్రిప్ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం శివమ్ అనే మూవీ కూడా చేస్తోంది. జనపలా ప్రసాద్ కుమార్తె, మరో ఇన్‌ఫ్లూయెన్సర్‌ మౌనిక అనే అమ్మాయితో… 2016లో సౌమ్యకు పరిచయం ఏర్పడింది. ఆమెతో పరిచయం పెంచుకుని.. 8ఏళ్లుగా వారితో నమ్మకంగా నటించి తరచుగా మౌనిక ఇంటికి వెళ్లేది. నేరుగా బెడ్ రూంలోకి వెళ్లి అక్కడ బాత్రూమ్ వాడుకుంటూ ఉండేది. గదిలోకి వెళ్లిన ప్రతిసారి.. గంటలు గంటలు ఉండేది. అలా రెండు మూడు సార్లు చేసింది సౌమ్య. అలా వెళ్లిన ప్రతిసారి చేతివాటం ప్రదర్శించింది. సుమారు కేజీ బంగారం కొట్టేసింది. అయితే యలమంచిలిలో బంధువుల వివాహానికి 23వ సాయంత్రం మౌనిక కుటుంబ సభ్యులు బయలుదేరారు. ఆభరణాల కోసం బీరువాలో లాకర్‌ తెరిచారు. అయితే అందులోని 100 తులాల ఆభరణాలు కనిపించలేదు.

తమ కుమార్తె స్నేహితులైన భార్యాభర్తలు… జనవరి 29, ఫిబ్రవరి 19న ఇంటికి వచ్చి వెళ్లారన్నారని రెండోసారి వచ్చినప్పుడు బాత్రూం వెళ్లి బెడ్‌రూం తలుపులు వేసి.. కొద్దిసేపటి తర్వాత వచ్చారన్నారు. సౌమ్యపై తమకు అనుమానం ఉందని తెలిపారు. దీంతో సౌమ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు.. అసలు గుట్టు విప్పారు. ఆమె నుంచి 74 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ‘మిగిలిన బంగారాన్ని తిరిగి ఇవ్వలేను. గట్టిగా అడిగితే సూసైడ్ చేసుకుంటా అంటూ బెదిరించిందని తెలుస్తోంది. మెుత్తం మీద ఈ కిలేడీ లేడి వ్యవహారం బయటకు వచ్చింది. ఫేమస్ అయ్యాక కూడా చెత్త పనులు చేస్తూ వార్తల్లో నిలిచింది సౌమ్య. సౌమ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 15 రోజుల రిమాండ్ తరలించారు.