Telangana, Temperature తెలంగాణలో పెరుగుతున్న ఎండలు..

తెలంగాణలో (Telangana) ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా అన్ని జిల్లాల్లో పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్‌కు (Degrees Celsius) పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 5 రోజుల నుంచి ఖమ్మంలో సాధారణం కన్నా 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత ఉంటోంది. హైదరాబాద్‌ (Hyderabad) లోనూ 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 4, 2024 | 08:56 AMLast Updated on: Feb 04, 2024 | 8:56 AM

The Sun Is Gradually Increasing In Telangana For The Past Few Days Daytime Temperatures Have Been Recorded Above 31 Degrees Celsius In All The Districts

తెలంగాణలో (Telangana) ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా అన్ని జిల్లాల్లో పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్‌కు (Degrees Celsius) పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 5 రోజుల నుంచి ఖమ్మంలో సాధారణం కన్నా 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత ఉంటోంది. హైదరాబాద్‌ (Hyderabad) లోనూ 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మహబూబ్‌నగర్‌(Mahbubnagar) , మెదక్‌(Medak) , భద్రాచలం, హనుమకొండ ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత కనిపిస్తోంది. గాలిలో తేమ శాతం తగ్గిపోతుండటమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోనూ మార్పులు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్, రామగుండంలలో సాధారణం(14 డిగ్రీలు) కన్నా 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. కోస్తా, ఉత్తరాంధ్రలో కూడా ఎండలు పెరుగుతున్నాయి. ఏపీలో రాత్రివేళ సాధారణ 21 డిగ్రీల సెల్సియస్ ఉంది. పగటివేళ అత్యధికంగా 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు 12 నుంచి 27 C కిలోమీటర్లుగా ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోకి గాలి వేగం సాధారణంగానే ఉంది.