Lavanya Raj Tarun : లావణ్య బాగోతాలు ఇవే.. సంచలన ఆధారాలు బయటపెట్టిన రాజ్‌తరుణ్‌..

రాజ్‌తరుణ్‌ లవ్‌ఎఫైర్‌ వ్యవహారం.. టాలీవుడ్‌లో రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. తనకు, రాజ్‌తరుణ్‌కు పెళ్లి అయిందని.. హీరోయిన్ మాయలో పడి తనను పట్టించుకోవడం లేదంటూ లావణ్య.. రాజ్‌తరుణ్‌ మీద గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 10, 2024 | 10:00 AMLast Updated on: Jul 10, 2024 | 10:00 AM

These Are The Benefits Of Lavanya Rajtarun Revealed The Sensational Evidence

 

 

రాజ్‌తరుణ్‌ లవ్‌ఎఫైర్‌ వ్యవహారం.. టాలీవుడ్‌లో రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. తనకు, రాజ్‌తరుణ్‌కు పెళ్లి అయిందని.. హీరోయిన్ మాయలో పడి తనను పట్టించుకోవడం లేదంటూ లావణ్య.. రాజ్‌తరుణ్‌ మీద గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన రాజ్‌తరుణ్‌.. లావణ్యతో ఒకప్పుడు రిలేషన్‌లో ఉన్న మాట నిజమేనని.. ఐతే ఇప్పుడు తనకు ఎలాంటి సంబంధం లేని.. మస్తాన్ సాయి అనే యువకుడితో లావణ్య రిలేషన్‌లో ఉందంటూ.. కొత్త బాంబ్ పేల్చాడు. ఐతే లావణ్య మాత్రం.. రాజ్‌తరుణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తోంది. అసలు తాను ఎవరితో ఎలాంటి రిలేషన్‌లో లేనని.. కావాలని తనను డీఫేమ్ చేయడానికి రాజ్‌తరుణ్‌ ప్రయత్నాలు చేస్తున్నారని.. డ్రగ్స్‌ కేసులో ఇరికించింది కూడా అందుకే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పరిణామాల మధ్య… అసలీ వ్యవహారంపై డయల్‌న్యూస్‌ టీమ్‌ లోతుగా విచారణ జరిపింది. ఇందులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయ్‌. అటు రాజ్‌తరుణ్‌ సంచలన ఆధారాలు బయటపెట్టాడు.

దీంతో ఈ లవ్‌ఎఫైర్ కేసు కొత్త మలుపు తీసుకున్నట్లు అయింది. ఇక ఈ వ్యవహారంలో అసలు నిజాలు పరిశీలిస్తే.. రాజ్‌తరుణ్‌తో మూడేళ్లు లావణ్య డేటింగ్ చేసింది. ఆ తర్వాత అతనితో విభేదాలు వచ్చాయ్.
అప్పటి నుంచి మీడియా ముందుకు వెళ్తానని… రాజ్‌తరుణ్‌ మీద లావణ్య ఒత్తిడి తీసుకువచ్చేదని తెలుస్తోంది. ఐతే తన కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని రాజ్‌తరుణ్‌.. చాలారోజులు మౌనంగా ఉండిపోయాడు. దీన్ని అలుసుగా తీసుకున్న లావణ్య.. మరింత రెచ్చిపోయింది. తన నుంచి డబ్బులు తీసుకొని.. జల్సాలకు, డ్రగ్స్‌కు అలవాటు పడిందని హీరో చెప్తున్న మాట. చాలామందితో చెడు స్నేహాలు చేసిందని.. మస్తాన్‌సాయి అనే యువకుడితో ప్రేమలో పడిందని చెప్తున్నాడు. ఐతే పెళ్లి అనేసరికి మస్తాన్ హ్యాండ్ ఇచ్చాడని.. దాని మీద పక్కా ఆధారాలతో లావణ్య పోరాటం కూడా చేసిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా లావణ్యను గుంటూరు పిలిపించుకున్న మస్తాన్ సాయి.. ఓ హోటల్‌ రూమ్‌లో బంధించి ఆమెపై దాడి చేసి.. సెల్‌ఫోన్ కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన న్యూస్‌పేపర్ కటింగ్స్‌ కూడా డయల్‌ న్యూస్ సంపాదించింది. మస్తాన్‌సాయి తనపై దాడి చేశాడని.. పట్టాభిపురం పీఎస్‌లో లావణ్య ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత.. డ్రగ్స్ కేసులో లావణ్య పోలీసులకు చిక్కింది. అప్పుడు కూడా అందరూ రాజ్‌తరుణ్‌ను టార్గెట్ చేశారు. ఇది తట్టుకోలేక లావణ్య నుంచి దూరంగా వచ్చేసి.. రాజ్‌తరుణ్ వేరే చోట ఉంటున్నాడు. ఇదీ రాజ్‌తరుణ్‌, లావణ్య సన్నిహితులు చెప్తున్న మాట. ఇలాంటి పరిణామాల మధ్య.. రాజ్‌తరుణ్ కీలక ఆధారాలు బయటపెట్టాడు. లావణ్య తనను ఎంత హింసించేదో చూడాలి అంటూ.. ఫోన్‌కాల్ రికార్డింగ్‌లు, ఆడియో రికార్డింగ్‌లు బయటపెట్టాడు. ఈ ఆడియోల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయ్. రాజ్‌తరుణ్‌ను బండబూతులు తిట్టడమే కాకుండా.. అతనిపై లావణ్య దాడి చేసినట్లుగా కూడా ఆ ఆడియోలో స్పష్టంగా అర్థం అవుతోంది. రాజ్‌తరుణ్‌, లావణ్య, మస్తాన్‌సాయి.. ఈ ముగ్గురి మధ్య చాలాసార్లు ఫోన్ సంభాషణలు జరిగినట్లు తెలుస్తోంది.

రాజ్‌తరుణ్‌ తనను అవమానించేలా ఓ పాట పాడారంటూ.. లావణ్య చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మస్తాన్‌సాయికి కాల్‌ చేసి రాజ్‌తరుణ్‌కు చెమట్లు పట్టించింది. ఇప్పుడీ ఆడియో వ్యవహారంతో.. లావణ్య అసలు బాగోతం బయటకు వచ్చినట్లు అయింది. రాజ్‌తరుణ్‌ మంచితనాన్ని ఆసరాగా చేసుకొని.. లావణ్య ఎంతలా హింసించిందో.. ఆ ఆడియో క్లియర్‌గా అర్థం అవుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. అప్పుడే ఫోన్‌కాల్‌లో ఏడవడం.. కాల్ కట్ అవగానే.. వెంటనే బూతు పురాణం అందుకోవడం.. లావణ్య తీరు ఇప్పుడు ప్రతీ ఒక్కరి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది. మరి ఈ సాక్ష్యాలు బయటకు వచ్చిన వేళ.. కేసు ఇంకెలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.