TSPSC: క్వశ్చన్ పేపర్ లీకేజ్‌ కేసు సంచలన మలుపు.. ఎంత మందికి పేపర్‌ అమ్మారో తెలుసా..

TSPSC పేపర్‌ లీకేజ్‌ కేసు కీలక మలుపు తిరగింది. ఈ కేసులో అరెస్టైన డీఈ రమేష్‌ 80 మందికి ఏఈ పేపర్‌ అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి రమేష్‌ 30 లక్షలు వసూలు చేసినట్టు చెప్తున్నారు పోలీసులు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 5, 2023 | 12:54 PMLast Updated on: Jun 05, 2023 | 12:54 PM

Tspsc Question Paper Leakage Issue

కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ రాజకీయ నేత సహాయంతో రమేష్‌ వ్యవహారం మొత్తం నడిపించినట్టు గుర్తించారు. పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లోని రాజకీయ నేతల పిల్లలకు రమేష్‌ పేపర్‌ అమ్మనట్టు తెలిపారు. దీంతో రమేష్‌ను కస్టడీకి అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. రమేష్‌ విచారణతో అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ కేసులో ఇప్పటికే 40 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌.. టీఎస్‌పీఎస్సీ పేపర్స్‌ వచ్చాక తనకు పరిచయమున్న TSPDCL జూనియర్‌ అసిస్టెంట్‌ సురేశ్‌ను దళారిగా మార్చాడు.

ఇతను AEE/DAO పేపర్స్‌ను 25 మందికి అమ్మనట్టు అధికారులు గుర్తించారు. అయితే సురేష్‌ ద్వారా క్వశ్చన్‌ పేపర్స్‌ కొన్న రమేష్‌ కొందరు వ్యక్తులకు ఆ పేపర్స్‌ అమ్మేశాడు. తమకు కూడా పేపర్స్‌ కావాలంటూ మరి కొందరు రమేష్‌ను సంప్రదించడంతో చాట్‌ ఉపయోగించాలని నిందితులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఒక్కో అభ్యర్థి దగ్గర 20 నుంచి 30 లక్షలు నిందితులు తీసుకున్నట్టు సమాచారం. ప్లాన్‌ ప్రకారం అభ్యర్థులు రమేష్‌ ఇచ్చిన మైక్రోఫోన్‌ బెల్ట్‌లో పెట్టుకుని ఎగ్జామ్‌ హాల్‌లోకి వెళ్లారు. అక్కడి ఎగ్జామినర్‌ సహాయంతో క్వశ్చన్‌పేపర్‌ ఫొటోలు తీసి రమేష్‌కు పంపారు.

ఆ ప్రశ్నలకు చాట్‌ జీపీటీ సహాయంలో సమాధానాలు వెతికిన రమేష్‌ మైక్రోఫోన్‌ ద్వారా అభ్యర్థులకు సమాధానాలు చేరవేశాడు. అయితే ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించిన ఎగ్జామినర్‌ను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎగ్జామ్‌ రాసే అభ్యర్థులతో డీల్‌ మాట్లాడిన డీఈ రమేశ్‌తో పాటు ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ ద్వారా పరీక్ష రాసిన ప్రశాంత్‌, నరేష్‌, మహేశ్‌, శ్రీనివాస్‌లను ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. ఈ ముఠా నుంచి క్వశ్చన్‌ పేపర్స్‌ కొన్న మరో 20 మంది అభ్యర్థులను కూడా గుర్తించామని పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు ఏకంగా 80 మందికి పేపర్‌ అమ్మినట్టు తెలియడంతో కేసు మరింత క్రిటికల్‌గా మారింది. రమేష్‌ కస్టడీ అనంతరం అరెస్టుల సంఖ్య పెరిగే చాన్స్‌ ఉంది.