లగ్జరీ ఫ్లాట్ కొన్న శ్రేయాస్ ఖరీదు ఎంతంటే ?

టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ మరో ఖరీదైన అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశాడు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో 2.90 కోట్లతో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 25, 2024 | 01:48 PMLast Updated on: Sep 25, 2024 | 1:48 PM

What Is The Cost Of Shreyas Who Bought A Luxury Flat

టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ మరో ఖరీదైన అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశాడు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో 2.90 కోట్లతో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తల్లి రోహిణీ అయ్య‌ర్‌తో క‌లిసి అత‌డు ఈ ఇంటిని కొన్న‌ట్టు స్థానిక‌ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యం అధికారులు చెబుతున్నారు. వర్లీలోని త్రివేణి ఇండస్ట్రియల్ 2వ అంతస్తులో ఈ అపార్ట్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయ్యర్ ఖరీదు చేసిన అపార్ట్‌మెంట్ ఉందని సమాచారం. రిజిస్ట్రేష‌న్ కోసం 17.40 ల‌క్ష‌ల స్టాంప్ డ్యూటీ కట్టినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ముంబైలో అయ్యర్ పేరిట ఓ అపార్ట్‌మెంట్ ఉంది. 2020లో ముంబైలోనే అత్యంత ఎత్తైన లోధా వ‌ర‌ల్డ్ ట‌వ‌ర్స్‌ 48వ అంత‌స్థులో ప్లాట్‌ను శ్రేయస్ కొనుగోలు చేశాడు.