YS SHARMILA: ఎన్నికల ప్రచారానికి షర్మిల రెడీ.. తల్లి ఏం చెప్పి పంపించారంటే..

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల.. ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. సొంత గడ్డపై నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఈ నెల ఐదున కడప నుంచి షర్మిల బస్సు యాత్ర మొదలవుతుంది. కడప జిల్లాలో ఎనిమిది రోజుల పాటు యాత్ర చేయనున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 4, 2024 | 06:27 PMLast Updated on: Apr 04, 2024 | 7:00 PM

Ys Sharmila Is Readying For Congress Campaign

YS SHARMILA: ఏపీలో ఎన్నికల ఫీవర్‌ పీక్స్‌ చేరింది. టీడీపీ, జనసేన ఇప్పటికే సభలతో జోష్‌లో కనిపిస్తుంటే.. రెండు రోజుల ప్రచారం చేసి పవన్ జ్వరం తెచ్చుకున్నాడు. వీళ్ల సంగతి ఎలా ఉన్నా.. ఈ మధ్యే అభ్యర్థులను ప్రకటించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల.. ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. సొంత గడ్డపై నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఈ నెల ఐదున కడప నుంచి షర్మిల బస్సు యాత్ర మొదలవుతుంది. కడప జిల్లాలో ఎనిమిది రోజుల పాటు యాత్ర చేయనున్నారు.

K KAVITHA: కవిత బెయిల్‌పై నో రిలీఫ్.. తీర్పు ఈనెల 8కి వాయిదా

జిల్లాలోని అన్ని మండలాల జనాలతో కలిసేలా షెడ్యూల్ రెడీ చేశారు. ప్రచారానికి బయల్దేరడానికి ముందు.. తల్లి విజయమ్మను కలిశారు షర్మిల. ఆమెను ఆశీస్సులు తీసుకొని.. ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో,.. చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నానని.. మీ రాజన్న బిడ్డను దీవించాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావం పూరించనున్నానని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చింది షర్మిల. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో.. జనాల ఆశీస్సులు తనపైనే ఉంటాయని ఆశిస్తున్నానని పోస్ట్ చేశారు. ఐతే ప్రచారానికి పంపిస్తూ.. షర్మిలను విజయమ్మ హత్తుకున్న తీరు ఇప్పుడు ప్రతీ ఒక్కరిని ఎమోషనల్ చేస్తోంది. ప్రచారానికి వెళ్లబోతున్న షర్మిలకు విజయమ్మ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మరీమరీ చెప్పారట.

ఇక అటు జగన్‌ కూడా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడానికి ముందు.. షర్మిల ఆశీస్సులు తీసుకున్నారు. ముద్దు పెట్టి.. జగన్‌ను ఎన్నికల ప్రచారానికి పంపించారు షర్మిల. రాజకీయ పార్టీల సంగతి ఎలా ఉన్నా.. కొడుకు, కూతురు విషయంలో విజయమ్మ ప్రేమ.. ఇప్పుడు నెటిజన్లను ఎమోషనల్‌ చేస్తోంది.