బ్రేకింగ్: ప్రసాదంలో కొవ్వు, కోర్ట్ కు వైసీపీ

ఏపీ హైకోర్టులో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసారు. టీటీడీలో విచారణ నేపథ్యంలో విజిలెన్స్ ఇచ్చిన నోటీసులను సుబ్బారెడ్డి సవాల్ చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 19, 2024 | 05:17 PMLast Updated on: Sep 19, 2024 | 5:17 PM

Yv Subbareddy File Case In High Court

ఏపీ హైకోర్టులో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసారు. టీటీడీలో విచారణ నేపథ్యంలో విజిలెన్స్ ఇచ్చిన నోటీసులను సుబ్బారెడ్డి సవాల్ చేసారు. తనకు నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వకముందే రిపోర్ట్ ఇవ్వటాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసారు. విజిలెన్స్ నివేదిక నిలుపుదల చేయాలని పిటిషన్ లో కోరిన సుబ్బారెడ్డి.. నోటీసులకు వివరణ ఇవ్వటానికి కొన్ని రికార్డ్స్ ఇవ్వాలని కోరినా స్పందించలేదని పిటిషన్ లో తెలిపారు.

రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దేవస్థానం బోర్డ్ క్లారిటీ ఇచ్చింది. గతంలో వాడిన నెయ్యి క్వాలిటీ నెయ్యి కాదని కమీషన్ కోసమే వేరే కంపెనీకి నెయ్యి సప్లై చేసే బాధ్యత ఇచ్చారని తెలిపింది. ఈ మేరకు ఓ నోట్ కూడా విడుదల చేసింది.