Uppal: హైదరాబాద్ సిగలో మరో నగ.. ఉప్పల్ కూడలి వద్ద స్కై వాక్ ఏర్పాటు..
హైదరాబాద్ : ఉప్పల్ రింగ్ రోడ్డులో పాదచారుల కష్టాలకు చెక్ చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం స్కైవాక్ ఏర్పాటు చేసింది. దీనిని సోమవారం మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మినిస్టర్ కేటీఆర్ హాజరయ్యారు. దాదాపు రూ. 25 కోట్లతో స్కైవాక్ బ్రిడ్జి నిర్మించారు. ఎక్కడా క్రింద నుంచి ట్రాఫిక్ నడుమ రోడ్డు దాటే అవసరం లేకుండా బ్రిడ్జ్ పై నుంచి వెళ్లొచ్చు. ఈ స్కై వాక్ పొడవు 665 మీటర్లు.. వెడల్పు 4 మీటర్లు కాగా 6 మీటర్ల ఎత్తులో దీనిని కట్టడం జరిగింది. బస్ స్టాప్, మోట్రోకు అనుసంధానం చేస్తూ ఇందులో మొత్తం 8 లిఫ్టులు, 4 ఎస్కలేటర్స్, 6 చోట్ల మెట్ల సౌకర్యం ఏర్పాటు చేశారు.

ఉప్పల్ వద్ద పాదచారుల కోసం ఏర్పాటు చేసిన స్కై వాక్

ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేశారు

రాత్రి పూట రంగురంగుల విద్యుత్ కాంతులతో అలంకరించారు

దాదాపు కొన్ని నెలల నుంచి దీనిని నిర్మిస్తూ వచ్చారు

వర్షం పడితే లోనికి నీరు పడకుండా పై కప్పు ఏర్పాటు చేశారు

ఉప్పల్ మొట్రోకి అనుసంధానం చేస్తూ నిర్మించారు

సూర్యాస్తమయం వేళ స్కై వాక్ చిత్రం

ఎనిమిది లిఫ్ట్ లు ఏర్పాటు చేశారు.

నడిచేందుకు విశాలమైన మార్గం

చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా నిర్మించారు

ప్రయాణీకులు కూర్చునేందుకు వీలుగా బల్లలు ఏర్పాటు

అంతరిక్షం నుంచి ఇలా కనిపిస్తుంది

నాలుగు ఎస్కలేటర్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు

మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు.

మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై నగరాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దేఅని కొనియాడారు