Top story: కోదాడలో 650, బెజవాడలో 872, ఏలూరులో 350 ఫోన్ పే, ప్రవీణ్ ఏం చేసాడు..?

పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో పోలీసులు చిక్కుముడులు విప్పుతున్నారు. ఈ కేసులో పక్కా సాక్ష్యాలతోనే మీడియా ముందుకు వస్తున్న ఏపీ పోలీసులు.. అతను హైదరాబాద్ నుంచి బయల్దేరిన దగ్గరి నుంచి మరణించే వరకు ఎక్కడెక్కడ ఆగాడు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 31, 2025 | 06:29 PMLast Updated on: Mar 31, 2025 | 6:29 PM

650 In Kodada 872 In Bezawada 350 In Eluru Phonepe What Did Praveen Do

పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో పోలీసులు చిక్కుముడులు విప్పుతున్నారు. ఈ కేసులో పక్కా సాక్ష్యాలతోనే మీడియా ముందుకు వస్తున్న ఏపీ పోలీసులు.. అతను హైదరాబాద్ నుంచి బయల్దేరిన దగ్గరి నుంచి మరణించే వరకు ఎక్కడెక్కడ ఆగాడు అనే విషయాలు అన్నిటికి సమాధానాలను సీసీ కెమెరా ఫూటేజ్ తో చెప్పేస్తున్నారు. విజయవాడలో ప్రవీణ్ 4 గంటల సేపు ఆగిన విషయాన్ని బయటపెట్టిన పోలీసులు.. అతను ఎక్కడ ఉన్నాడు అనే విషయాలను ఫోటోలు, వీడియోలతో సహా చూపించారు.

రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్‌ విజయవాడలో ఆగాడని ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌ వెల్లడించిన తర్వాత.. దానిపై పోలీసులు సాంకేతిక ఆధారాలను బయటకు తీసే ప్రయత్నం చేసారు. సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా ప్రవీణ్‌ ప్రతి కదలికను పోలీసులు బయటపెట్టారు. విజయవాడ, రాజమహేంద్రవరం పోలీసులు మొత్తం 300 కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు.

అతను విజయవాడలో మద్యం కొన్నాడు అని గుర్తించారు. అంతకంటే ముందే కోదాడలో మద్యం కొన్నట్టు తేల్చేసారు. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరాడు. అదేరోజు మధ్యాహ్నం సమయంలో కోదాడలోని మద్యం దుకాణంలో రూ.650తో మద్యం సీసా కొనుగోలు చేసి, ఫోన్‌పే ద్వారా చెల్లించాడు అని సాక్ష్యాలను సేకరించారు. ఇక ఏపీలోకి అడుగు పెట్టడానికంటే ముందే అతను మద్యం తాగినట్టు గుర్తించారు. ఆయన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల-పరిటాల మధ్య అదుపుతప్పి పడిపోవడంతో బుల్లెట్‌ హెడ్‌లైట్‌ పగిలింది. అలాగే బండికి ఉన్న బంపర్ కూడా వంగింది. ప్రవీణ్‌ చేతులకు కూడా గాయాలయ్యా యి.

ఆ తర్వాత విజయవాడ రూరల్ గొల్లపూడిలో పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయిన్చుకున్నాడు. అప్పటికే అతను మాట్లాడలేని పరిస్థితిలో.. ఉండి అక్కడి సిబ్బందికి సైగలు చేసాడు. ఈ విషయాన్ని బంకు సిబ్బంది పోలీసులకు తెలిపారు. అతను 8 వేళ్ళు చూపించగా… రూ.800కు పోయమంటారా అని సిబ్బంది మళ్లీ అడగగా.. కాదు అని తల ఊపాడు. ఎనిమిది లీటర్లు పోయమంటారా అంటే అడిగితే అవునని సంకేతం ఇస్తూ తల పైకి, కిందకు ఊపారట. దీనికి సంబంధించిన డబ్బులను కూడా అతను రూ.872 ఫోన్‌ పే చేశాడు.

అక్కడికి వచ్చే సమయానికే అతని చేతులకు గాయాలు ఉన్నాయని.. బుల్లెట్‌ హెడ్‌లైడ్‌ ఊడిపోయి ఉందని బంకు సిబ్బంది పోలీసులకు తెలిపారు. పెట్రోల్ బంకు సీసీ కెమెరాల ఫుటేజీని పెట్రోల్‌ బంక్‌ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకుని విచారించారు. ఆ తర్వాత ఆయన జాతీయ రహదారిపై దుర్గగుడి ఫ్లై ఓవర్‌, రాజీవ్‌గాంధీ పార్కు, పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ మీదుగా బెంజిసర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌ ఎక్కి మహానాడు జంక్షన్‌కు చేరుకున్నాడు ప్రవీణ్. ఆ మార్గంలోని అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్‌ బుల్లెట్‌పై వెళ్తున్న దృశ్యాలు పోలీసులకు కనిపించాయి. మహానాడు కూడలి దాటాక రామవరప్పాడు రింగ్‌ వస్తుంది.

ఇక్కడ సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు ప్రవీణ్‌ కనిపించలేదు. దీనితో ఈ సమయంలో ఏదో జరిగిందని అనుమానించిన పోలీసులు.. రామవరప్పాడు రింగ్‌కు పది మీటర్ల దూరంలోనే వోక్స్‌ వ్యాగన్‌ షోరూమ్‌కు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్‌పై నుంచి ఆయన పడిపోగా అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు అతడిని గుర్తించి అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ సుబ్బారావుకు విషయం చెప్పగా.. ఆయన అక్కడికి చేరుకొని.. పక్కన ఉన్న రెయిలింగ్‌ వద్ద కూర్చోబెట్టారు. ఆ తర్వాత పాస్టర్‌ను ఎస్‌ఐ నెమ్మదిగా నడిపించుకుంటూ వచ్చారు.

బుల్లెట్‌ను ఆటోడ్రైవర్లు తోసుకుంటూ రింగ్‌ వద్ద ఉన్న ట్రాఫిక్‌ బూత్‌ దగ్గరకు తీసుకోవచ్చి.. ముఖం కడుక్కోవడానికి ఆయనకు ట్రాఫిక్‌ ఎస్‌ఐ నీళ్లు ఇవ్వగా.. ఆ తర్వాత బూత్‌ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి 8.20 గంటల వరకు పాస్టర్‌ నిద్రపోయాడు. ఆ తర్వాత మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని ఎస్‌ఐ కౌన్సెలింగ్‌ ఇవ్వగా.. తర్వాత ఇన్నోటెల్‌ హోటల్‌ పక్కన ఉన్న టీస్టాల్‌ వద్దకు తీసుకెళ్లి టీ తాగించారు. టీ తాగిన తర్వాత ప్రవీణ్‌ బుల్లెట్‌పై ఏలూరు వైపు బయల్దేరి వెళ్ళగా.. ట్రాఫిక్‌ ఎస్‌ఐ వద్దని వారించినా ఆయన ఆగలేదు.

అతను ట్రాఫిక్‌ ఎస్‌ఐతో కలిసి టీ తాగడానికి వెళ్లడం, తిరిగి ట్రాఫిక్‌ బూత్‌ వద్దకు వచ్చిన దృశ్యాలు ఇన్నోటెల్‌ హోటల్‌ సీసీ కెమెరాల్లో రికార్డు కాగా వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత టోల్‌గేట్లు దాటుకుని ఏలూరు చేరుకున్నాక అక్కడ టానిక్‌ వైన్స్‌లో మద్యం కొని, రూ.350 ఫోన్‌పే చేసినట్టు గుర్తించారు. అక్కడి వీడియోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రయాణానికి పక్కా ఏర్పాట్లతోనే అతను బయల్దేరాడు. తలకు జావా కంపెనీ హెల్మెట్‌, కాళ్లకు తెలుపు రంగు బూట్లు, బుల్లెట్‌కు వెనుక ఒక బ్యాగ్‌ పెట్టుకుని బయల్దేరాడు.

విజయవాడ వచ్చే వరకు చాలా చోట్ల ఆగినా సరే హెల్మెట్ తీయలేదు. రామవరప్పాడు రింగ్‌ సమీపంలో పడిన సమయంలో.. అతను ఎవరు అనేది ట్రాఫిక్ పోలీసులకు తెలియదు. బుల్లెట్‌ హెడ్‌లైట్‌ పగిలిపోయి వైరుతో వేలాడుతూ ఉండడం, సేఫ్టీ రాడ్లు వంగిపోవడం, చేతులకు కొట్టుపోయినట్టుగా గాయాలు ఉండటం, హెల్మెట్‌కు సొట్ట పడటంతో వీడియోలు, ఫొటోలు తీసారు. హెల్మెట్ అవగాహన కోసమే తాను ఫోటోలు తీసాను అని ఎస్సై వివరించారు.
సీసీ కెమెరాలు చూపించిన సమయాలు ఒకసారి చూస్తే..

24వ తేదీ సాయంత్రం 4.45 గంటలకు ప్రవీణ్‌ గొల్లపూడిలో పెట్రోలు బంక్‌కు చేరుకున్నారు.

5.13 గంటలకు మహానాడు కూడలిలో జాతీయ రహదారిపై సీసీ కెమెరాలో కనిపించారు.

5.30 గంటలకు పోలీసులు రామవరప్పాడు రింగ్‌ వద్ద ట్రాఫిక్‌ బూత్‌ వద్దకు తీసుకొచ్చారు.

5.30- 8.20 గంటల వరకు బూత్‌ ఎదురుగా గడ్డిలో నిద్రపోయారు.

రాత్రి 8.47 గంటలకు రామవరప్పాడు రింగ్‌ నుంచి ఏలూరు వైపు వెళ్లారు.