నా గురించి బాలకృష్ణను అడుగు చంద్రబాబు: భూమన సవాల్

లడ్డు వ్యవహారంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. సిఎం చంద్రబాబు చాలా పెద్ద తప్పు చేశారు అన్నారు. సి.బి. ఐ విచారణ, సుప్రీం కోర్టు సిటింగ్ జడ్జి తో విచారణ జరపాలని కోరుతున్నాను అని తెలిపారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 23, 2024 | 06:46 PMLast Updated on: Sep 23, 2024 | 6:46 PM

Bhoomana Challenge To Chandrababu Naidu

లడ్డు వ్యవహారంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. సిఎం చంద్రబాబు చాలా పెద్ద తప్పు చేశారు అన్నారు. సి.బి. ఐ విచారణ, సుప్రీం కోర్టు సిటింగ్ జడ్జి తో విచారణ జరపాలని కోరుతున్నాను అని తెలిపారు. మూడు సార్లు నాకు పాలక మండలి సభ్యులు గా, రెండు సార్లు టిటిడి చైర్మన్ గా నాకు అవకాశం కల్పించారు ఆ దేవ దేవుడు దయ వల్లనే అని ఆయన వ్యాఖ్యానించారు.

మేము ఏ తప్పు చేయలేదు అని స్పష్టం చేసిన భూమన హిందూ సాంప్రదాయం పద్ధతి లోనే కూతురు వివాహం జరిగింది అన్నారు. కుర్తాళం పీఠాది పతి, స్వరూపానంద స్వామి హాజరు అయ్యారు అని మీ వియ్యంకుడు , మీ బావమరిది బాలకృష్ణ కూడా నా కూతురు వివాహం కు హాజరు అయ్యారు..హిందూ సంప్రదాయం పద్ధతి లో జరిగింది ఆయన్ని అడిగి తెలుసుకోండి చంద్రబాబు అంటూ సవాల్ చేసారు. చేప నూనె , పంది కొవ్వు కలిపారు అని ఈవో చేత చెప్పించారు అని చంద్రబాబు మెదడులో కుళ్ళు ఉంది, సోషల్ మీడియా ద్వారా విషం ప్రచారం చేశారు అని మండిపడ్డారు.