హరీష్, కేటిఆర్ పై పెట్రోల్ పోస్తా; రెచ్చిపోయిన మైనంపల్లి

కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. మల్లన్న సాగర్ నిర్వాసితులను బీఆర్ఎస్ పట్టించుకోలేదు అని మండిపడ్డారు. షోపుటాపు తప్ప ఏమీ లేదు అని హరీష్ రావుకు ఏడుపు వచ్చిందో లేదో అంటూ ఎద్దేవా చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 1, 2024 | 01:19 PMLast Updated on: Oct 01, 2024 | 1:19 PM

Mynampalli Hanumantha Rao Sensational Comments On Ktr And Harish Rao

కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. మల్లన్న సాగర్ నిర్వాసితులను బీఆర్ఎస్ పట్టించుకోలేదు అని మండిపడ్డారు. షోపుటాపు తప్ప ఏమీ లేదు అని హరీష్ రావుకు ఏడుపు వచ్చిందో లేదో అంటూ ఎద్దేవా చేసారు. మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. నేనూ పది కోట్ల రూపాయలు సేకరిస్తా, అంబానీ తలచుకుంటే మొత్తం నిర్వాసితులను అదుకోవచ్చు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేసారు.

ఎందిరినో రెచ్చగొట్టి ప్రాణాలు తీశారు అని మండిపడ్డారు మైనంపల్లి. ఏ ఒక్కరి ప్రాణం పోయినా హరీష్ రావు, కేటిఆర్ దే బాధ్యత అన్నారు. నా పేరు మీద, నా భార్య పేరు మీద ఉన్న ఆస్తులు ఇస్తామని… అవసరమైతే నేను తగలబెట్టుకుంటా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. పేదలను, బ్యాంకు లోన్లు తీసకున్న వారిని ఆదుకుంటాం అని స్పష్టం చేసారు. బిఆర్ఎస్‌ హయాంలో అడ్డగోలు అనుమతులు ఇచ్చారు అని మండిపడ్డారు. అరేయ్ కెటిఆర్ నీ ఆస్తి మొత్తం బాధితులకు ఇవ్వు అంటూ సవాల్ చేసారు. నేనూ నా ఆస్తి మొత్తం ఇస్తా అంటూ మైనంపల్లి చెలరేగిపోయారు. అవసరమైతే హరీష్ రావు, కేటిఆర్ మీద పెట్రోల్ పోస్తా అంటూ హెచ్చరించారు.