NARA LOKESH: చంద్రబాబును అంతమొందించాలని చూస్తున్నారు.. లోకేష్‌ సంచలన ఆరోపణ..

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగీతో మరణించారని చెప్పారు లోకేష్. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ ఆందోళన వ్యకత్ం చేశారు. చంద్రబాబును కూడా ఇలాగే చేయాలని కుతంత్రాలు చేస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 21, 2023 | 03:58 PMLast Updated on: Sep 21, 2023 | 3:58 PM

Nara Lokesh Concerned About Father Nara Chandrababu Naidus Security

NARA LOKESH: చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంతో ఏపీలో పుట్టిన హీట్‌ ఇంకా తగ్గలేదు. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పి ఎలాంటి సౌకర్యాలు లేకుండా చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారంటూ నారా లోకేష్‌ ట్విటర్‌లో ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును జైల్‌లోనే చంపేందుకు ప్రయత్నిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాజమండ్రి జైల్‌లో విపరీతంగా దొమలు ఉన్నాయని.. రీసెంట్‌గా డెంగీ వ్యాధితో చనిపోయిన ఓ ఖైదీ గురించి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా ఇలాగే చేయాలని జగన్‌ సర్కార్‌ ప్లాన్‌ చేస్తోందంటూ ఆరోపించారు లోకేష్‌. ప్రస్తుతం లోకేష్‌ చేసిన ట్వీట్‌ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగీతో మరణించారని చెప్పారు లోకేష్. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ ఆందోళన వ్యకత్ం చేశారు. చంద్రబాబును కూడా ఇలాగే చేయాలని కుతంత్రాలు చేస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. చంద్రబాబుకి ఏం జరిగినా జగన్ దే బాధ్యతని వార్నింగ్ ఇచ్చారు. రీసెంట్‌గా చంద్రబాబును ములాఖత్‌లో కలిసిన భువనేశ్వరి కూడా దాదాపు ఇవే కామెంట్స్‌ చేశారు. జైల్‌లో చంద్రబాబుకు ప్రత్యేక సౌకర్యాలు ఏవీ లేవని.. అందరు ఖైదీల్లానే ఆయనను కూడా ట్రీట్‌ చేస్తున్నారని చెప్పారు. కక్షసాధింపు చర్యలో భాగంగానే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ ఆరోపించారు. కానీ జైలు అధికారుల వాదన మాత్రం వేరేలా ఉంది.

కోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు అన్ని వసతులు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇంటికి ఏమాత్రం తీసిపోకుండా జైల్‌లో అన్ని వసతులు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిన ఈ మాటల యుద్ధం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.