బై బై జగన్… జనసేన గూటికి మరో మాజీ ఎమ్మెల్యే

వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్కరిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని సీనియర్ నేతలు వీడుతున్నారు. జనసేనలోకి చేరేందుకు మరో మాజీ ఎమ్మెల్యే కిలారీ రోశయ్య సిద్దమయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 21, 2024 | 05:02 PMLast Updated on: Sep 21, 2024 | 5:02 PM

Ponnur Ex Mla Join In Janasena

వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్కరిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని సీనియర్ నేతలు వీడుతున్నారు. జనసేనలోకి చేరేందుకు మరో మాజీ ఎమ్మెల్యే కిలారీ రోశయ్య సిద్దమయ్యారు. నేడు మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ తో భేటీ అయిన కిలారి రోశయ్య.. పార్టీలోకి వచ్చే అంశంపై చర్చించారు. పార్టీలో చేరికపై ముహూర్తం ఖరారు అయినట్టు సమాచారం.

ఇటీవలే వైఎస్సార్‌సీపీకి రాజీనామా పలువురు కీలక నేతలు.. త్వరలోనే జనసేనలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ , ఉదయభాను జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు కూటమి పార్టీలలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపధ్యంలో వైసీపీ అధిష్టానంలో ఆందోళన మొదలయింది.