గవర్నర్ గా సాయి రెడ్డి ,జగన్ అదిరిపోయే స్కెచ్…?
రాజకీయాల్లో కొంతమంది ఉన్నా లేకపోయినా... వాళ్ళు ఏం చేసినా సరే సంచలనం అవుతూనే ఉంటుంది. అందులో మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఒకరు.

రాజకీయాల్లో కొంతమంది ఉన్నా లేకపోయినా… వాళ్ళు ఏం చేసినా సరే సంచలనం అవుతూనే ఉంటుంది. అందులో మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఒకరు. వైసీపీకి అలాగే రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నా అంటూ హడావుడి చేశారు. అయితే తాజాగా ఆయన ఉపరాష్ట్రపతి అధికారిక కార్యక్రమంలో కనపడటం చూసి అందరూ షాక్ అయ్యారు. వాస్తవానికి విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరమైన తర్వాత బిజెపిలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.
కానీ ఇప్పుడు మాత్రం తమిళనాడు గవర్నర్ గా వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు ప్రచారం మొదలైంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆశీర్వాదం కూడా ఆయనపై గట్టిగానే ఉంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆయన సన్నిహితంగా ఉంటారు. వైసిపి 2019లో అధికారంలోకి రావడానికి ఇదే ప్రధాన కారణం అని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. రాజకీయంగా కూడా దీనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న విజయసాయిరెడ్డి లాబీయింగ్ మొదలుపెట్టి గవర్నర్ అయ్యేందుకు అన్ని మార్గాలను సుగుమం చేసుకుంటున్నట్లు ప్రచారం స్టార్ట్ అయింది.
తమిళనాడు గవర్నర్ పదవీకాలం త్వరలో ముగియనుంది. దీనితో కచ్చితంగా విజయసాయిరెడ్డి ఆ పదవిలో ఉండే అవకాశం ఉందని టాక్. రాజ్యసభ ఎంపీగా ఉన్నా సరే తనకు ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో.. మూడున్నరేళ్లు పదవి ఉండగానే ఆయన వదులుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న విజయ్ సాయి రెడ్డికి ఉన్న పరిచయాలతో ఆయన కచ్చితంగా ఏదో ఒక కీలక పదవిలో ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. గతంలో కూడా ఆయన గవర్నర్ పదవి కోసం ప్రయత్నాలు గట్టిగానే చేసారు.
వాటిని నిజం చేస్తూ విజయసాయిరెడ్డి గవర్నర్ గా రాజభవన్ లో అడుగుపెట్టేందుకు బ్యాక్ గ్రౌండ్ లో గట్టిగానే వర్క్ చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే ఆయనకు గవర్నర్ పదవి ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ ఎంతవరకు స్వాగతిస్తుంది అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. రాజకీయంగా విజయసాయిరెడ్డిని చంద్రబాబు నాయుడుతో పాటుగా టిడిపి క్యాడర్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటుంది. కచ్చితంగా ఆయనకు గవర్నర్ పదవి ఇస్తే మాత్రం కూటమిలో వాతావరణం తేడా వచ్చే అవకాశాలు కూడా ఉండవచ్చు. అయితే జగన్ తో తనకు ఎటువంటి సంబంధాలు లేవని విజయ్ సాయి రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం వద్ద రుజువు చేసుకున్నారని మరికొంతమంది అంటున్నారు. అయితే జగన్ కేసుల్లో విజయసాయిరెడ్డి ఏ 2 గా ఉండటంతో కచ్చితంగా జగన్ ను కాపాడేందుకు విజయసాయి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగానే అర్థమవుతుంది. మరి విజయసాయి రెడ్డికి గవర్నర్ పదవి ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.