తిరుమల లడ్డుపై సుమన్ సంచలన కామెంట్స్

తిరుమల లడ్డు వివాదంపై సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. లడ్డు ప్రసాదం భక్తులు అందరూ ఎంతో భక్తి విశ్వాసంతో తీసుకుంటారు అని... దానిని కల్తీ చేశారు... అంటే అది ఎంత తప్పు.. టెర్రరిజం కన్నా పెద్ద నేరం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 29, 2024 | 06:22 PMLast Updated on: Sep 29, 2024 | 6:22 PM

Suman Comments On Tirumala Laddu Issue

తిరుమల లడ్డు వివాదంపై సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. లడ్డు ప్రసాదం భక్తులు అందరూ ఎంతో భక్తి విశ్వాసంతో తీసుకుంటారు అని… దానిని కల్తీ చేశారు… అంటే అది ఎంత తప్పు.. టెర్రరిజం కన్నా పెద్ద నేరం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. టీటీడీ బోర్డు అధికారులు ఇంత మంది ఉన్నా.. తప్పు ఎలా జరిగింది అని నిలదీశారు. నెయ్యి కల్తీలో ఎవరు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తప్పకుండా శిక్షించాలి అని డిమాండ్ చేసారు.

టీటీడీ బోర్డులో భక్తితో ఉన్న వారినే సభ్యులుగా పెట్టాలి అని కోరారు. రాజకీయం, పలుకుబడి ఉన్న వారు కాకుండా దేవుడి గురించి 24గంటలు పాటుపడే వారు, నిత్యం దేవుడి సేవలో ఉండే వారు,భక్తితో ఉండే వారిని బోర్డు లో ఉంచాలని స్పష్టం చేసారు. ఒక హిందూ మతమే కాదు ఏ మతంలో ఐనా ఇలా తప్పు జరుగకుండా చూడాలి అని కోరారు. అన్ని మతాల విశ్వాసాలు కాపాడేందుకు పార్లమెంట్లో ప్రత్యేకంగా చట్టం చేయాలి అని డిమాండ్ చేసారు.