శ్రీను గారిని తీసుకెళ్ళిపో, మాధురి సంచలనం

దువ్వాడ వాణి వ్యాఖ్యలపై తాజాగా దివ్వెల మాధురి వీడియో విడుదల చేసారు. తలకు క్లాట్ అయి బ్లీడింగ్ అవుతున్న కారణంగా డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నారు అని ఆమె పేర్కొన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 19, 2024 | 04:15 PMLast Updated on: Aug 19, 2024 | 4:15 PM

Take Srinu Gari Madhuri Sensation

దువ్వాడ వాణి వ్యాఖ్యలపై తాజాగా దివ్వెల మాధురి వీడియో విడుదల చేసారు. తలకు క్లాట్ అయి బ్లీడింగ్ అవుతున్న కారణంగా డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నారు అని ఆమె పేర్కొన్నారు. కానీ వాణి నాపై చేసిన కామెంట్స్ వల్ల నేను మాట్లాడవలసి వస్తుందని… నావల్ల దువ్వాడ వానికి, శ్రీనుకి త్రెట్ ఉందని వాణి కామెంట్స్ చేసిందని ఆమె మండిపడ్డారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్ కి రెండేళ్లుగా ఆలనా పాలన నేనే చూసుకున్నాను అని గత రెండేళ్లుగా నా వల్ల ఎటువంటి త్రెట్ లేనప్పుడు ఇప్పుడే త్రేట్ ఎలా ఉంటుంది అని ఆమె నిలదీసింది.

వాణినే పది మంది మనుషులను తీసుకొచ్చి గోడలు,తలుపులు విరగ్గొట్టి శ్రీనివాస్ పై దాడి చేసి చంపడానికి యత్నించారు అని ఆమె ఆరోపించారు. శ్రీనివాస్ గారు ఆ ఘటనపై ఫిర్యాదు కూడా ఫైల్ చేశారు అన్నారు. సో శ్రీనివాస్ గారికి ఆమె వల్ల థ్రెట్ ఉందో నా వల్ల థ్రెట్ ఉందో ప్రజలే గ్రహించాలి అని ఆమె కోరారు. నేను ఆ ఇంట్లో ఉంటున్నానని నేను రాకూడదని ఆమె అంటోంది అని శ్రీనుగారు స్థలం ఓనర్ పార్వతీశంకి ఎలా అయితే రూ.60 లక్షలు పెండింగ్ ఉన్నారో అలాగే నేను కూడా రూ.2కోట్లు ఇంటి నిర్మాణంకి ఇచ్చి ఉన్నాను అని పేర్కొన్నారు.

దానికి సంభందించి శ్రీను గారు నాకు చెక్కులు ఇచ్చి ఉన్నారు అన్నారు. నాకు ఇవ్వాల్సిన రెండు కోట్లు ఇచ్చేసి వానిని ఆ ఇల్లు తీసుకోమనoడి అని…లేదంటే శ్రీనుగారిని తీసుకొని ఆరు కోట్లు విలువ చేసే శ్రీను గారు ఆమెకు ఇచ్చిన ఇంటికి వెళ్లిపోయి ఏమైనా ఉంటే లీగల్ గా ప్రొసీడ్ అవ్వమనoడి అంటూ ఆమె వ్యాఖ్యలు చేసారు. లేకపోతే నేను మీడియా సమక్షంలో శ్రీను గారు ఉన్న ఇంటికి వచ్చి తేల్చుకుంటాను అంటూ కామెంట్స్ చేసారు.