YS anti-fans : వైఎస్ యాంటీ ఫ్యాన్స్ కు నిద్రపట్టట్లేదా..?

తెలుగు సినిమా పరిశ్రమలో గత కొంత కాలంగా వరుస బయోపిక్స్ వస్తున్నాయి. పలువురు సినీ తారలతో పాటు క్రీడా, రాజకీయ ప్రముఖుల జీవిత కథల ఆధారంగా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. వీటిలో చాలా బయోపిక్స్ మంచి విజయాలను అందుకున్నాయి. అలాంటి వాటిలో ‘యాత్ర‘ ఒకటి. ఆంద్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఎలక్షన్స్ ముందు విడుదల అయ్యింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 21, 2023 | 12:31 PMLast Updated on: Dec 21, 2023 | 12:31 PM

Ys Anti Fans Cant Sleep

తెలుగు సినిమా పరిశ్రమలో గత కొంత కాలంగా వరుస బయోపిక్స్ వస్తున్నాయి. పలువురు సినీ తారలతో పాటు క్రీడా, రాజకీయ ప్రముఖుల జీవిత కథల ఆధారంగా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. వీటిలో చాలా బయోపిక్స్ మంచి విజయాలను అందుకున్నాయి. అలాంటి వాటిలో ‘యాత్ర‘ ఒకటి. ఆంద్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఎలక్షన్స్ ముందు విడుదల అయ్యింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు వైఎస్ జగన్ కు బాగా కలిసి వచ్చింది. ‘యాత్ర’ మంచి సక్సెస్ అందుకోవడంతో వైఎస్సార్ తనయుడు, ఆంధ్రప్రదేశ్ తాజా ముఖ్యమంత్రి జీవిత కథ ఆధారంగా సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ మహీ వీ రాఘవ్. ‘యాత్ర 2‘ పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ హీరో జీవా జగన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ‘యాత్ర 2’ టైటిల్‌, మోషన్ పోస్టర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వైఎస్ అభిమానులతో పాటు సినీ అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇవాళ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే కావడంతో ‘యాత్ర 2‘కు సంబంధించి మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో వైఎస్సార్‌గా మమ్ముట్టి కనిపించగా.. వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిగా జీవా దర్శనమిచ్చాడు. ఈ పోస్టర్‌ను చూసి వైఎస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.