ఫ్లైట్‌లో సామాన్యుడిలా జగన్‌.. షర్మిలే నయం.. ఇంత ఓవరాక్షనా..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 14, 2024 | 04:17 PMLast Updated on: Aug 14, 2024 | 4:18 PM

Ys Jagan Travelled In Normal Flight

సోషల్‌ మీడియా ఓపెన్ చేయగానో.. జగన్‌ ఫొటో ఒకటి తెగ వైరల్ అయింది. ఇండిగో ఫ్లైట్‌లో భార్యతో కలిసి సామాన్యుడిలా జగన్ ట్రావెల్ చేసిన ఫొటో అది. ఇది ఇప్పుడు వైసీపీ బాస్‌ను కార్నర్ అయ్యేలా చేస్తోంది. ఫ్లైట్‌లో బిజినెస్‌ క్లాస్‌ ఉన్నా.. వెళ్లే స్థాయి జగన్‌కు ఉన్నా.. ఆయన మాత్రం ఎకానమీ క్లాస్‌లో వెళ్లడం విచిత్రంగా ఉందని.. ఇంత ఓవరాక్షన్ అవసరమా అంటూ.. కొందరు జగన్ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. చెల్లి షర్మిలతో పోలుస్తూ.. మరిన్ని సెటైర్లు వేస్తున్నారు. ఐతే జగన్ మీద ఈ రేంజ్‌లో కోపం తెచ్చుకోవడానికి కారణాలు కూడా చెప్తున్నారు నెటిజన్లు. సీఎంగా ఉన్నప్పుడు పర్యటన ఏదైనా సరే.. ప్రత్యేక విమానం కంపల్సరీ అన్నట్లుగా జగన్ తీరు కనిపించేది. పెట్టుబడుల కోసం అని దావోస్ వెళ్లినా.. ఢిల్లీ టూర్ వెళ్లినా.. పర్యటన ఏదైనా, కారణం ఎలాంటిదైనా.. ప్రత్యేక విమానంలో వెళ్లివచ్చేవారు జగన్. జనాల సొమ్ము ఖర్చు పెట్టేప్పుడు ప్రత్యేక విమానాలా.. సొంతంగా వెళ్లాలి అనుకుంటే ఎకానమీ క్లాస్‌లా అంటూ.. నెటిజన్లు జగన్‌ను ఆడుకుంటున్నారు. వందలు, వేల కోట్ల ఆస్తులు ఉన్న జగన్ దంపతులు.. ఇలా ఎకానమీ క్లాస్‌లో వెళ్లడం కచ్చితంగా ఓవరాక్షనే అనే చ్చ జరుగుతోంది. జనాల సొమ్ము అంటే ఎంతైనా ఖర్చు చేస్తారు.. సొంత డబ్బు అయితే ఇలా పొదుపు మంత్రమా అంటూ ఎటాక్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక్కడితో ఆగారా అంటే.. ఏపీ సర్కార్‌ మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే.. భారతితో జగన్‌ బస్సులోనే ట్రావెల్ చేస్తారేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక అటు షర్మిలతో కంపేర్ చేస్తూ.. జగన్‌ను మరింత ఆడుకుంటున్నారు నెటిజన్లు. షర్మిలకు ప్రస్తుతం ఎలాంటి పదవి లేదు.. ప్రజాప్రతినిధి కానే కాదు. జగన్‌తో పోలిస్తే ఆస్తుల విషయంలోనూ.. అంతంతమాత్రమే! అలాంటిది షర్మిల ఎక్కడికి వెళ్లినా.. ప్రత్యేకంగా ఓ ఫ్లైట్ బుక్‌ చేసుకుంటున్నారు. ప్రత్యేక విమానంలో వెళ్లి.. పనులు చూసుకుంటారు. కొడుకు ఎంగేజ్‌మెంట్‌కు జగన్‌ను ఇన్వైట్ చేయడానికి వెళ్లినపప్పుడు కూడా.. ఫ్యామిలీతో కలిసి షర్మిల స్పెషల్ ఫ్లైట్‌లోనే వెళ్లారు. ఈ లెక్కన అన్నతో పోలిస్తే.. చెల్లి నయం కదా అంటూ.. కొత్త చర్చ జరుగుతోంది. ఐతే అటు వైసీపీవర్గాలు మాత్రం ఇలాంటి ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయ్. జగన్ సింప్లిసిటీకి ఇది నిదర్శనమని.. ఈ ప్రయాణాన్ని కూడా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని ఫైర్ అవుతున్నారు వైసీపీ నేతలు.