Tsunami 2004: సునామీ ప్రళయానికి 19 ఏళ్లు.. వేల మందిని పొట్టనపెట్టుకున్న మహా ప్రళయం

ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 9.1 మాగ్నిట్యూడ్‌తో భూకంపం వచ్చింది. దాని ప్రభావానికి హిందూ మహాసముద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. గంటల వ్యవధిలోనే రాకాసి అలలు తీరానికి దూసుకువచ్చాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 26, 2023 | 05:31 PMLast Updated on: Dec 26, 2023 | 5:31 PM

2004 Indian Ocean Earthquake And Tsunami 19 Years Since Devastating Tsunami

Tsunami 2004: అది 2004 డిసెంబర్‌ 26. అంతా క్రిస్మస్‌ వేడుకల్లో మునిగిపోయారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎంజాయ్‌ చేస్తున్నారు. చాలా మంది కుటుంబం కోసం సొంతూర్లకు వెళ్లారు. కానీ ఆ రాత్రి తెల్లారేసరికి ప్రకృతి ప్రకోపానికి మానవాళి బలయ్యింది. ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 9.1 మాగ్నిట్యూడ్‌తో భూకంపం వచ్చింది. దాని ప్రభావానికి హిందూ మహాసముద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. గంటల వ్యవధిలోనే రాకాసి అలలు తీరానికి దూసుకువచ్చాయి.

Ex Girl Friend: మాజీ ప్రియురాలితో జాగ్రత్త.. ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించిన మాజీ లవర్

తీర ప్రాంతాలను తమలో కలిపేసుకున్నాయి. 17.4 మీటర్ల ఎత్తు మేర ఎగసిపడ్డ రాకాసి అలలు.. హిందూమహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న 14 దేశాల తీర ప్రాంతాలను కకావికలం చేశాయి. 5 వేల కిలోమీటర్లు ప్రయాణించిన సునామీ అలలు ఆఫ్రికా తీరానికి కూడా తీవ్ర నష్టాన్ని కలిగించాయి. భారత్‌, ఇండోనేషియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌ సహా తొమ్మిది దేశాల్లో.. ఈ సునామీ 2 లక్షల 30 వేలకు పైగా ప్రజలను పొట్టన పెట్టుకుంది. 18 లక్షల మంది నిరాశ్రయులు కాగా.. 50వేల మంది గల్లంతయ్యారు. భారత్‌‌లో సుమారు 10 వేల మందికి పైగా చనిపోయారు. అందులో అండమాన్ నికోబార్ దీవుల్లో 4 వేల మంది, తమిళనాడులో 4,500 మంది చొప్పున చనిపోయారు. ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద ప్రకృతి విలయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన అణు బాంబు కంటే 23 వేల రెట్లు అధికమైన శక్తి ఈ సునామీ వల్ల విడుదలైంది.

ఈ విషయాన్ని అమెరికన్‌ జియోలాజికల్‌ సర్వే అప్పట్లో అధికారికంగా ప్రకటించింది. మొదట్లో భూకంప తీవ్రతను 8.8గా లెక్కించినప్పటికీ 2005లో 9.0కి సవరించారు. కానీ యూఎస్‌జీఎస్‌ మాత్రం 9.1గా అంచనా వేసింది. కానీ, 2006లో జరిపిన పరిశోధనల ప్రకారం.. ఈ భూకంప పరిమాణం 9.1 నుంచి 9.3 ఉంటుందని తేల్చారు. మాగ్నిట్యూడ్‌ ఎంత ఉన్నప్పటికీ.. మానవ చరిత్రలో మాత్రం ఇది చెరిగిపోని గాయపు మరకగా మిగిలిపోయింది.