హైదరాబాద్: చార్జర్ కోసం మహిళను చంపేసాడు

ఈ మధ్య కాలంలో నేరాలు చాలా కామెడీగా జరుగుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 26, 2024 | 04:48 PMLast Updated on: Aug 26, 2024 | 4:48 PM

Women Murdered For Mobile Charger At Hyderabad

ఈ మధ్య కాలంలో నేరాలు చాలా కామెడీగా జరుగుతున్నాయి. తాజాగా దుండిగల్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ చార్జర్ కోసం మహిళను చంపేసాడు ఒక యువకుడు. బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న శాంత ను హత్య చేసిన యువకుడు… చార్జర్ కోసం చంపాడని పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్ చార్జర్ కోసం ఆమెతో కమల్ కుమార్ అనే యువకుడు దాదాపు గంట సేపు గొడవ పడ్డాడు.

చార్జర్ ఇవ్వకపోవడంతో శాంతపై దాడి చేసిన కమల్ కుమార్… ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. కమల్ కుమార్ దాడిలో కిందపడి ఆమె కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆమె అరవకుండా నోరు మూసి హత్యకు పాల్పడ్డాడు. హత్య ఉదంతం సిసి టీవీలో రికార్డు అయింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.