సెమీస్ లో అమన్ సహ్రావత్

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 8, 2024 | 07:33 PMLast Updated on: Aug 08, 2024 | 7:33 PM

Aman Sehrawat Qualified For Semi Finals In Paris Olympics

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు వరుస పరాజయాలు ఎదురవుతున్న వేళ రెజ్లర్ అమన్ సహ్రావత్ సత్తా చాటాడు. పురుషుల 57 కేజీల విభాగంలో సెమీఫైనల్ చేరుకున్నాడు. మొదట ప్రిక్వార్టర్స్‌లో అమన్ 10-0 తేడాతో వాద్లిమిర్ ను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరాడు. తర్వాతి బౌట్ లో అల్బేరియా రెజ్లర్ ను చిత్తు చేశాడు. 12-0 స్కోర్ తో మాజీ వరల్డ్ ఛాంపియన్ కు షాకిచ్చాడు. తొలి రౌండ్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై అమన్ ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించి తిరుగులేని ఆధిక్యంతో గెలిచాడు. సెమీస్ లో అమన్ జపాన్ కు చెందిన ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ హిగుచితో తలపడతాడు.