హెడ్ ,మార్ష్ మెరుపులు తొలి టీ20లో ఆసీస్ గెలుపు

ఇంగ్లాండ్ టూర్ లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీలో 28 పరుగుల తేడాతో విజయం సాధించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 12, 2024 | 06:29 PMLast Updated on: Sep 12, 2024 | 6:29 PM

Aussies Win In First T20

ఇంగ్లాండ్ టూర్ లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీలో 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ 179 రన్స్ కు ఆలౌటైంది. ఓపెనర్లు హెడ్ , మార్ష్ మెరుపు బ్యాటింగ్ తో మంచి స్కోరుకు పునాది వేశారు. హెడ్ 23 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. ఛేజింగ్ లో ఇంగ్లాండ్ పవర్ ప్లేలోనే 4 వికెట్లు చేజార్చుకుంది. ఫిల్ సాల్ట్ 20 రన్స్ చేయగా.. లివింగ్ స్టోన్ 37, శామ్ కరన్ 18 రన్స్ తో చివర్లో పోరాడారు. కీలక సమయంలో పుంజుకున్న ఆసీస్ బౌలర్లు ఇంగ్లాండ్ ను 151 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ విజయంతో ఐదు టీ ట్వంటీల సిరీస్ లో ఆసీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.