Team India: జూనియర్ లక్ష్మణ్.. జూనియర్ గంబీర్.. టెస్ట్ క్రికెట్ గత వైభవం చూడబోతున్నాం

ఐపీఎల్ 2023 సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ లు తమ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. తమతమ ఫ్రాంచైజీలకు వొంటి చేత్తో విజయాలను అందించిన ఈ ఫ్యూచర్ స్టార్స్, ఇప్పుడు టీమిండియాలో చేరి, ఎన్నో మైలురాళ్లను అందుకోనున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 20, 2023 | 03:06 PMLast Updated on: Jun 20, 2023 | 3:06 PM

Both Ruthuraj Gaikwad And Yashaswi Jaiswal Are Being Hailed As Junior Laxman And Junior Gambhir By Sports Fans

ఐసిసి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఓటమితో టీమిండియా సర్వత్రా నెగటివిటీని చవిచూసింది. ఈ నేపథ్యంలో రానున్న విండీస్ టూర్ కోసం కొందరు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి, ఈ ఇద్దరు చిచ్చరపిడులకు అవకాశం ఇచ్చే ప్లాన్ లో ఉందట బీ సి సి ఐ. చాలా రోజులుగా టీమిండియాకు సరైన టెస్టు ఓపెనర్ లేకుండా పోయాడు. శిఖర్ ధావన్ ఉన్నప్పుడు అన్ని ఫార్మాట్లలో ఓపెనింగ్ కి దిగి అదరగొట్టేవాడు, ఆ తరవాత అంతటి ఆటగాడిని ఫైండ్ అవుట్ చేయలేకపోయింది భారత క్రికెట్.

దూకుడుతో పాటు, చక్కని క్రికెట్ ఆటతో మెప్పించగల ఈ ఇద్దరు సెన్షేషన్ ప్లేయర్స్ ని సలెక్ట్ చేయడం చూసి, టీమిండియా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులైతే, ఈ ఇరువురినీ జూనియర్ లక్ష్మణ్, జూనియర్ గంభీర్ లుగా ఆకాశానికేతెస్తున్నారు. ఐ పి ఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్ లో కూడా దుమ్ముదులిపిన ఈ ఆటగాళ్లను సరిగ్గా సానపెడితే, మరో ఆరేడేళ్ల పాటు, టెస్టు ఫార్మాట్ ఓపెనింగ్ కోసం వెతికే పనుండదు. ఇక విండీస్ టూర్ షెడ్యూల్ విషయానికొస్తే జులై 12-16 మధ్య తొలి టెస్టు, 20-24 నుంచి రెండో టెస్టు జరుగనుండగా జులై 27 నుంచి ఆగస్టు 1 వరకూ మూడు వన్డేలు జరుగుతాయి.