Hardik Pandya : కొడుకుతోనే సెలబ్రేషన్స్.. నటాషాతో పాండ్యా విడిపోయినట్టే

భారత క్రికెట్ లో గత కొంతకాలంగా హార్థిక్ పాండ్యా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ లో ముంబై సారథిగా పగ్గాల అందుకున్న తర్వాత ఫ్యాన్స్ నుంచి తీవ్ర ట్రోలింగ్ రావడం, దీనికి తోడు జట్టును సరిగా నడిపించలేకపోవడంతో విమర్శల పాలయ్యాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 6, 2024 | 03:00 PMLast Updated on: Jul 06, 2024 | 3:00 PM

Celebrations With Son Natasha Pandya Is Separated

భారత క్రికెట్ లో గత కొంతకాలంగా హార్థిక్ పాండ్యా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ లో ముంబై సారథిగా పగ్గాల అందుకున్న తర్వాత ఫ్యాన్స్ నుంచి తీవ్ర ట్రోలింగ్ రావడం, దీనికి తోడు జట్టును సరిగా నడిపించలేకపోవడంతో విమర్శల పాలయ్యాడు. అన్నింటికీ మించి అటు వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. నటాషా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో హార్దిక్‌తో కలిసి ఉన్న ఫొటోలను డిలీట్ చేశారు. భార్య నటాషాతో విభేదాలు వచ్చినట్టు, విడాకులు తీసుకుంటున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. వీటిపై ఇటు పాండ్యా కాని, అటు నటాషా కాని అధికారికంగా స్పందించలేదు. అయితే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పాండ్యాను ఆమె అభినందించకపోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది.

తాజాగా స్వదేశానికి తిరిగి వచ్చిన హార్థిక్ పాండ్యా తన విన్నింగ్ సెలబ్రేషన్స్ ను కేవలం కొడుకుతోనే జరుపుకోవడం వీరిద్దరి విడాకుల వార్తను దాదాపుగా ఖరారు చేసినట్టయింది. కొడుకుతో సెలబ్రేట్ చేసుకున్న ఫోటోల్లో నషాటా లేకపోవడంతో అభిమానులు వీరిద్దరూ విడిపోయినట్టు భావిస్తున్నారు. తాజాగా నటాషా పెట్టిన పోస్టు కూడా చర్చనీయాంశంగా మారింది. జీవితంలో కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరిగా ఉంటామని, . అలాంటి సమయంలో ఎవరూ తోడుగా లేరని బాధపడనవసరం లేదంటూ ఆమె ఓ వీడియోను పోస్టు చేసింది. ఈ పోస్ట్ హార్దిక్‌ పాండ్యా గురించే పెట్టినట్టు చర్చ జరుగుతోంది. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితులను తట్టుకుని వరల్డ్ కప్ లో రాణించిన పాండ్యాపై ప్రశంసల జల్లు కురుస్తోంది.